• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » International » రన్ వేపై విమానం.. మంటల్లో 113 మంది!

రన్ వేపై విమానం.. మంటల్లో 113 మంది!

Last Updated: May 12, 2022 at 12:41 pm

చైనాలో మరో విమాన ప్రమాదం జరిగింది. చాంగ్‌కింగ్ ఎయిర్‌పోర్ట్‌లో టిబెట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో అగ్ని ప్రమాదం సంభవించింది. టేకాఫ్ సమయంలో రన్‌వేపై నుంచి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు

టిబెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం.. గురువారం ఉదయం 8 గంటలకు చైనాలోని చాంగ్‌కింగ్‌ నుంచి టిబెట్‌లోని న్యింగ్‌చికి బయలుదేరింది. అయితే, చాంగ్‌కింగ్‌ ఎయిర్‌పోర్టులో టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే సిబ్బంది విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో వెంటనే ల్యాండ్‌ చేశారు. అయితే, ల్యాండింగ్‌ అవుతుండగా అది రన్‌వేదాటి వెళ్లిపోయింది. దీంతో విమానం రెక్కలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

అప్పటికే అప్రమత్తంగా ఉన్న ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది.. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని అత్యవసర ద్వారం నుంచి కిందికి దించివేశారు. ఈ క్రమంలో 40 మందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు అధికారులు. ప్రమాద సమయంలో ఆ విమానంలో 113 ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. రన్‌వేపై ప్రమాదం జరగడంతో కొద్దిసేపటి వరకు విమాన రాకపోకలను నిలిపివేశారు అధికారులు.

According to reports, at about 8:00 on May 12, a Tibet Airlines flight deviates from the runway and caught fire when it took off at Chongqing Jiangbei International Airport.#chongqing #airplane crash #fire pic.twitter.com/re3OeavOTA

— BST2022 (@baoshitie1) May 12, 2022

Advertisements

చైనాలో మార్చిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన విమానం గ్వాంగ్జి ప్రావిన్స్ వుజా నగర సమీపంలోని కొండల్లో కుప్పకూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో 132 మంది మరణించారు. గాల్లో ఎగురుతున్న విమానం ఒక్కసారిగా కంట్రోల్ తప్పి.. అడవుల్లో కుప్పకూలింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో విమానంలోని ప్రయాణికులంతా సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంపై చైనీస్ సంస్థల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

లాలూ ప్ర‌సాద్ ఇంట్లో సీబీఐ దాడులు..!

దేశ ప‌ర్య‌ట‌న‌కు కేసీఆర్..!

పీకే ప్లాన్ షురూ..!!

విమానం అత్య‌వ‌స‌ర ల్యాండింగ్.. తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం..!

తెలంగాణలో జనసేన.. ఎవరికి నష్టం?

ఈ కారు ధర 14.3 కోట్లు.. !

బ్యాగ్ పోగొట్టుకున్న బ్యూటీ… ! రెడ్ కార్పెట్ పై ఎలా మెరిసిందంటే..!

జ్ఞాన్ వాపి మసీదు కేసులో సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

ఒక్క పైసా సాయం చేయ‌లేదు..!

డబుల్ బెడ్ రూం కాదు.. టాయిలెట్ లో.. !

మస్క్ పై లైంగిక వేధింపుల కేసు…. కప్పిపుచ్చుకునేందుకు..!

సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన సినీ స్టార్స్ ఎవరో తెలుసా ?

ఫిల్మ్ నగర్

సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన సినీ స్టార్స్ ఎవరో తెలుసా ?

సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన సినీ స్టార్స్ ఎవరో తెలుసా ?

న‌ల్ల డ్రెస్ లో నాగిని న‌టి.. సొగ‌సులు ఒల‌క‌బోస్తున్న అందాల బ్యూటీ..!

న‌ల్ల డ్రెస్ లో నాగిని న‌టి.. సొగ‌సులు ఒల‌క‌బోస్తున్న అందాల బ్యూటీ..!

సురేఖతో పెళ్లికి చిరు తండ్రి ఒప్పుకోలేదట!! కానీ

సురేఖతో పెళ్లికి చిరు తండ్రి ఒప్పుకోలేదట!! కానీ

ఎన్టీఆర్ ఇంటి ముందు.. అభిమానుల హంగామా..!

ఎన్టీఆర్ ఇంటి ముందు.. అభిమానుల హంగామా..!

ఆ అగ్రహీరోలపై కేసులు నమోదు...!

ఆ అగ్రహీరోలపై కేసులు నమోదు…!

devi-nagavalli

దేవి నాగవల్లిని ఇమిటేట్ చేస్తూ…జబర్దస్త్ లో స్కిట్

సర్కారువారి పాట మొదటి వారం వసూళ్లు

సర్కారువారి పాట మొదటి వారం వసూళ్లు

వెంకటేశ్ తో అడవి మనిషి సినిమా ప్లాన్ చేశాడంట

వెంకటేశ్ తో అడవి మనిషి సినిమా ప్లాన్ చేశాడంట

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)