చైనాలో మరో విమాన ప్రమాదం జరిగింది. చాంగ్కింగ్ ఎయిర్పోర్ట్లో టిబెట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో అగ్ని ప్రమాదం సంభవించింది. టేకాఫ్ సమయంలో రన్వేపై నుంచి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే, విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు
టిబెట్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం.. గురువారం ఉదయం 8 గంటలకు చైనాలోని చాంగ్కింగ్ నుంచి టిబెట్లోని న్యింగ్చికి బయలుదేరింది. అయితే, చాంగ్కింగ్ ఎయిర్పోర్టులో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సిబ్బంది విమానంలో సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో వెంటనే ల్యాండ్ చేశారు. అయితే, ల్యాండింగ్ అవుతుండగా అది రన్వేదాటి వెళ్లిపోయింది. దీంతో విమానం రెక్కలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
అప్పటికే అప్రమత్తంగా ఉన్న ఎయిర్పోర్ట్ సిబ్బంది.. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందిని అత్యవసర ద్వారం నుంచి కిందికి దించివేశారు. ఈ క్రమంలో 40 మందికి పైగా ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు అధికారులు. ప్రమాద సమయంలో ఆ విమానంలో 113 ప్రయాణికులు, తొమ్మిది మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. రన్వేపై ప్రమాదం జరగడంతో కొద్దిసేపటి వరకు విమాన రాకపోకలను నిలిపివేశారు అధికారులు.
According to reports, at about 8:00 on May 12, a Tibet Airlines flight deviates from the runway and caught fire when it took off at Chongqing Jiangbei International Airport.#chongqing #airplane crash #fire pic.twitter.com/re3OeavOTA
— BST2022 (@baoshitie1) May 12, 2022
Advertisements
చైనాలో మార్చిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్ సంస్థకు చెందిన విమానం గ్వాంగ్జి ప్రావిన్స్ వుజా నగర సమీపంలోని కొండల్లో కుప్పకూలిపోయింది. ఈ విమాన ప్రమాదంలో 132 మంది మరణించారు. గాల్లో ఎగురుతున్న విమానం ఒక్కసారిగా కంట్రోల్ తప్పి.. అడవుల్లో కుప్పకూలింది. అనంతరం పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో విమానంలోని ప్రయాణికులంతా సజీవ దహనమయ్యారు. ఈ ప్రమాదంపై చైనీస్ సంస్థల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.