B
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రధానపాత్రలో దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రిపబ్లిక్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు అక్టోబర్ 1న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఈ ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ కలెక్టర్ గా ప్రజలలో చైతన్యాన్ని తీసుకువచ్చే ఆఫీసర్ గా కనిపించనున్నాడు.
ఇదిలా ఉండగా ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన తేజ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే విషయమై చిరు స్పందిస్తూ… తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష..అంటూ పేర్కొన్నారు చిరు.
సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు. రిపబ్లిక్ చిత్రం అక్టోబర్ 1 వ తారీఖున విడుదల చేస్తే బాగుంటుందన్న తన కోరిక మేరకు అదే తేదీన చిత్రం విడుదల అవుతుంది. మీ ఆదరణ, అభిమానం, ప్రేమే సాయి ధరమ్ తేజ్ కి శ్రీరామ రక్ష.
Launching the trailer :https://t.co/mdA3ILcZld@IamSaiDharamTej
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2021
Advertisements