సినిమా టికెట్ల ధరల పై కొత్త జీవో ను ఏపీ సర్కార్ విడుదల చేసింది. మున్సిపాలిటీ, కార్పొరేషన్, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీల వారీగా టిక్కెట్ ధరలను నిర్ణయించింది.
ఇక టికెట్ ధరల పై ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఇదే విషయమై ట్వీట్ చేస్తూ…తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగేవిధంగా, అటు థియేటర్ల మనుగడను,ప్రజలకి వినోదం అందుబాటులోఉండాలనే సంకల్పాన్ని దృష్టిపెట్టుకుని, సినిమా టికెట్ రేట్స్ సవరిస్తూ సరికొత్త GO జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ గారికి పరిశ్రమ తరుపున కృతజ్ఞతలు అని అన్నారు.
చిన్న సినిమాకు ఐదవ షో అవకాశంకల్పించటం ఎందరో నిర్మాతలకుఉపయోగపడే అంశం. సంబంధితమంత్రివర్యులు పేర్ని నాని గారికి,అధికారులకి, కమిటీ కి ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు.
Thank you Sri. @ysjagan garu @AndhraPradeshCM pic.twitter.com/BsvmsEPrxt
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 7, 2022
Advertisements
ఇక ఫిబ్రవరి 10న టికెట్ ధరల పై కొత్త జీవోను విడుదల చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్ ను చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి, మహేష్ బాబు, కొరటాల శివ, ఆర్.నారాయణమూర్తి కలిసిన సంగతి తెలిసిందే.