• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top Stories » వాస్తవాలు వెల్లడించిన సిటిజన్ జర్నలిస్ట్ మిస్సింగ్..!

వాస్తవాలు వెల్లడించిన సిటిజన్ జర్నలిస్ట్ మిస్సింగ్..!

Last Updated: February 10, 2020 at 2:54 pm

చైనాలో కరోనా వైరస్ గురించి వాస్తవాలను వెల్లడించే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ ప్రకటనల కంటే కూడా అక్కడున్న వాస్తవ పరిస్థితులను ప్రజలకు వెల్లడిస్తున్న ఇద్దరు సిటిజన్ జర్నలిస్టుల్లో ఒకరు కనిపించకుండా పోయారు. మరొకరిని ప్రభుత్వ అధికారులు పిలిపించి కొంత సేపు నిర్బంధించారు. అక్కడ ఏమి జరిగిందో ఏమో కానీ అతను ఇంటికొచ్చాక మౌనంగా ఉంటున్నారు. అతను మౌనంగా ఉండడం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని ప్రభుత్వం ఏదో చేసిందని ఆరోపిస్తున్నారు.

ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాపించిన తర్వాత చైనాలో ఏం జరుగుతుందో ప్రభుత్వ అధికారిక ప్రకటనల కంటే కూడా చెన్ కిషీ, ఫంగ్ బిన్ అనే ఇద్దరు సిటిజన్ జర్నలిస్ట్స్ చెప్పే వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది. వారిద్దరు చైనాలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు మొబైల్ ఫోన్ లో ఫోటోలు, వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. వుహాన్ లో జరగుతున్న దారుణ వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేసేవారు. వారు చెప్పేదానికి కోసం ప్రపంచమంతా ఎదురు చూసేది. వుహాన్ లో దారుణాలను తాను చూసినది చూసినట్టుగా రిపోర్ట్ చేస్తున్న చెన్ కిషీ నాలుగు రోజులుగా కనిపించడం లేదు. కుటుంబసభ్యులకు, మిత్రులకు ఎవరికీ అందుబాటులో లేడు. పోలీసులు తమకేమి తెలియదని అన్నారు. దీంతో చెన్ తల్లిదండ్రులు తన కుమారుడి జాడ కనుగొనాలని ప్రజలకు విజ్ఙప్తి చేశారు.
చెన్ సోషల్ మీడియా విబో అకౌంట్ లో ఉన్న 7,40,000 ఫాలోవర్స్ , గతంలో పోస్ట్ చేసిన వీడియోలన్నీ డిలెట్ అయ్యాయి. అతని సొంత చానెల్ కు 4,33000 మంది సబ్ స్క్రైబర్లు, ట్విట్టర్ అకౌంట్ లో 2,46000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. రెండింటిని ప్రభుత్వం బ్లాక్ చేసింది.

చెన్ మిస్సింగ్ కావడంతో అతన్ని క్వరైంటైన్ ( వైరస్ పరీక్షించే వార్డుల్లో )లో నిర్బంధించి ఉండొచ్చనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే అతను ఎక్కడున్నాడనే విషయాన్ని మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు దృవీకరించ లేదు.

చెన్ మిస్సింగ్ కావడంపై ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదని ముందుగా హెచ్చరించిన వుహాన్ డాక్టర్ లీ వెంగ్ లియాంగ్ మృతిపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఇప్పుడు చెన్ మిస్సింగ్ తో ప్రభుత్వం పై మండిపడుతున్నారు. దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ”వుయ్ వాంట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్” యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో నినదిస్తున్నారు.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

నూపుర్ శర్మ.. బాధ్యత వహించాల్సిన అవసరం లేదు!

పద్మాలయ భూముల్లో అవకతవకలు.. చర్యలు ఏవి?

బంకర్ హౌజ్.. 5 కోట్లు మాత్రమే !! అణుదాడిని సైతం తట్టుకునేలా..!

పంత్ పంతం..ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు

ప్రభుత్వాన్ని నడిపిస్తోంది కేసీఆర్ కాదు!

జోక్.. బీజేపీకి టీఆర్ఎస్ పోటీనా?

వేలు విడిచిన మేనమామ అంటే ఎవరు…?

మోడీ షెడ్యూల్.. మినిట్ టు మినిట్!

ముర్ముకే ఛాన్స్.. కాంగ్రెస్ కు షాకిచ్చిన దీదీ

పేదల ఇళ్లు కూల్చిన టీఆర్ఎస్ నేతలు

భక్తజనసంద్రం.. పూరీ క్షేత్రం..కన్నులపండువగా రథోత్సవం

తెలంగాణ నుంచి మోడీ పాఠాలు నేర్చుకోవాలి… కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

ఫిల్మ్ నగర్

ఇకపై నా టార్గెట్ అదే - రాజమౌళి

ఇకపై నా టార్గెట్ అదే – రాజమౌళి

నితిన్ సినిమాకు రూ.30 కోట్లు కావాలంట?

నితిన్ సినిమాకు రూ.30 కోట్లు కావాలంట?

నాని దసరా మూవీ అప్ డేట్స్ ఇవే

నాని దసరా మూవీ అప్ డేట్స్ ఇవే

అల్లూరి.. శ్రీవిష్ణు కెరీర్ లోనే భారీ యాక్షన్ డ్రామా

అల్లూరి.. శ్రీవిష్ణు కెరీర్ లోనే భారీ యాక్షన్ డ్రామా

పక్కా కమర్షియల్...ఇది చాలా కమర్షియల్ గురూ!! రివ్యూ

పక్కా కమర్షియల్…ఇది చాలా కమర్షియల్ గురూ!! రివ్యూ

ఇస్మార్ట్ బ్యూటీ.. ఇక సినిమాల‌కు దూర‌మేనా..?

ఇస్మార్ట్ బ్యూటీ.. ఇక సినిమాల‌కు దూర‌మేనా..?

సైబ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో క‌న్న‌డ న‌టి ప‌విత్రాలోకేష్..!

సైబ‌ర్ పోలీస్ స్టేష‌న్ లో క‌న్న‌డ న‌టి ప‌విత్రాలోకేష్..!

ఓటీటీలోకి మేజ‌ర్ వ‌చ్చేది..ఎప్ప‌టినుండంటే..?

ఓటీటీలోకి మేజ‌ర్ వ‌చ్చేది..ఎప్ప‌టినుండంటే..?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)