భారత తదుపరి న్యాయమూర్తి ఎంపికకు కసరత్తులను కేంద్రం ప్రారంభించింది. భారత ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ వచ్చే నెల 8న పదవీ విరమణ చేయనున్నారు.

ఈ క్రమంలో తదుపరి న్యాయమూర్తిగా ఎవరికి అవకాశం ఇవ్వాలో సూచించాలని జస్టిస్ లలిత్కు కేంద్రం లేఖ రాసింది. ఆనవాయితీ ప్రకారం సీజేఐలు అత్యంత సీనియర్ న్యాయమూర్తిని తన వారసునిగా ప్రతిపాదిస్తూ వస్తున్నారు.
సీనియారిటీని పరిగణనలోకి తీసుకుంటే జస్టిస్ డీవై చంద్రచూడ్ అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. సాధారణంగా సీజేఐ సూచించే వ్యక్తిని తదుపరి సీజేఐగా కేంద్ర ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉంటుంది.
భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ఆగస్టు 26న పదవీ విరమణ చేశారు. అనంతరం ఆయన వారసుడిగా ఆగస్టు 27న జస్టిస్ యూయూ లలిత్ బాధ్యతలు చేపట్టారు.
ఆయన మరో నెలలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో తదుపరి సీజేఐ నియామక ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది.