ఉస్మానియా యూనివర్సిటీ లోని అన్ని కోర్సులకు ఆఫ్ లైన్ తరగతులు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతాయని సోమవారం సాయంత్రం అధికారులు తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు ఓయూ పరిధిలోని అన్ని కళాశాలల్లోను ఆఫ్ లైన్ తరగతులు ప్రారంభమవనున్నట్టు అధికారులు పత్రికా ప్రకటనలో తెలిపారు.
ఓయూలో యూనివర్సిటీ క్యాంపస్ ప్రిన్సిపల్స్, యూనివర్సిటీలోని ఇతర అడ్మినిస్ట్రేటివ్ అధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలో కోవిడ్ మహమ్మారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల యొక్క ప్రస్తుత సెమిస్టర్ లు అన్నింటికీ.. ఫిబ్రవరి 12 వరకు ఆన్ లైన్ మోడ్ లో తరగతులను కొనసాగిస్తోందని వెల్లడించారు.
విశ్వవిద్యాలయ అధికారుల కోర్సులు ఆన్ లైన్ మోడ్ లో జరుగుతాయని పేర్కొన్నారు. కాంట్రాక్ట్, పార్ట్ టైమ్ ప్రాతిపదికన ఉన్న వారితో సహా.. బోధనా సిబ్బంది జనవరి 31 నుండి కళాశాల విధులకు హాజరు కావాలని పేర్కొన్నారు. వారు ఫిబ్రవరి 1 నుండి కళాశాల నుండి ఆన్ లైన్ తరగతులు తీసుకుంటారని వెల్లడించారు.
కరోనా వ్యాప్తిని అరికట్టడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1 నుంచి ఆఫ్ లైన్ లో అన్ని తరగతులు నిర్వహించనున్నట్టు యూనివర్సిటీ అధికారులు స్పష్టం చేశారు.