భట్టి విక్రమార్క (సీఎల్పీ నేత)
రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి మార్గాలు లేక, ఆదాయంరాక తీవ్ర నిరుత్సాహంలో ఉంది. ఏడాదిగా ఉపాది లేక నాగార్జున సాగర్ హిల్ కాలనీలో ఉంటున్న రవి అనే ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మొన్న సునీల్ నాయక్, నిన్న మహేందర్ యాదవ్.. నేడు రవి ఆత్మహత్యలు ముఖ్యమంత్రి పాపమే. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కొలువుల కోసమేనని.. ఆ కొలువులు రావని తెలిసి యువత ఆత్మహత్యకు పాల్పడుతోంది. కానీ ఆత్మహత్యలు దీనికి సమాధానం కాదు. రాష్ట్రంలో ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం యువత మరో ఉద్యమం మొదలు పెట్టాలి.
ముఖ్యమంత్రి ప్రజలను మాటలతో భ్రమలో ఉంచుతూ తెచ్చుకున్న తెలంగాణ లక్ష్యాలను నీరు గార్చుతున్నాడు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం దోపిడీకి గురౌవుతోంది. ఈ దోపిడీని ఆపాలంటే యువత రోడ్డుమీదకు వచ్చి.. ఉద్యమానికి నడుం బిగించాలి. ఎన్నికలను కుటిల ప్రయత్నాలుతో గెలుస్తూ.. తాను చేసింది కరెక్ట్ అని ప్రజలు తీర్పు ఇస్తున్నారని చెబుతున్న కేసీఆర్ కు ఎన్నికల్లోనే ప్రజలు బుద్ది చెప్పాలి.