• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Andhra Pradesh » చంపేసి.. మానవతావాది అంటూ..!!

చంపేసి.. మానవతావాది అంటూ..!!

Last Updated: January 3, 2023 at 4:44 pm

రాష్ట్రంలో 2 లక్షల 66 వేల మంది గ్రామ వాలంటీర్లు ప్రజల సేవల్లో నిమగ్నమయ్యారని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వివరించారు. గతంలో మాదిరిగా ఎక్కడా లంచాలు లేవు.. ఎక్కడా వివక్ష లేదని స్పష్టం చేశారు. గతంలో పింఛన్‌ మంజూరు కావాలంటే జన్మభూమి కమిటీ వద్దకు వెళ్లాల్సిన దుస్థితి ఉండేదని.. ఆ కమిటీలు అడిగే మొదటి ప్రశ్న మీరు ఏ పార్టీకి చెందిన వారని.. అడిగేవారని పేర్కొన్నారు.

మూడు నెలల పింఛన్‌ లంచంగా ఇస్తే తప్ప.. పింఛన్‌ మంజూరు అయ్యేది కాదన్నారు. కానీ.. ఈ రోజు అలాంటి పరిస్థితి లేదని జగన్ వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో జరిగిన పింఛన్‌ వారోత్సవాల్లో సీఎం జగన్‌ మాట్లాడారు. చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.’ఓ ముద్దాయి తల్లిదండ్రులను చంపేసి.. తనకు తల్లిదండ్రులు లేరని కోర్టులో ఏడుస్తాడు. చంద్రబాబు తీరు ఈ ముద్దాయిలాగే ఉంది. ఎన్టీఆర్‌ను చంపేసి.. ఎన్నికలప్పుడు ఫొటోకు దండ వేస్తారు.

ఫొటో షూట్, డ్రోన్ షాట్ల కోసం ఇదే రాజమండ్రిలో 29 మందిని చంద్రబాబు చంపేశాడు. కందుకూరులో ఫొటో షూట్, డ్రోన్ షాట్ కోసం ఎనిమిది మందిని చంపేశారు. మనుషులను చంపేస్తారు.. వాళ్ల పాలిట తానే మానవతావాది అంటారు. ఇలాంటి దారుణాన్ని దత్తపుత్రుడు ప్రశ్నించరు. కొత్త సంవత్సరం రోజు కూడా జనాన్ని పొట్టపెట్టుకున్నారు. వేల సంఖ్యలో టోకెన్లు ఇచ్చి.. అరకొరగా చీరలు తెచ్చారు. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు మోసాలు చూశాం. చంద్రబాబును ప్రశ్నించని వారంతా దొంగలే’ అని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు.

‘కొత్తగా మరికొందరికి పింఛన్లు జాబితాలో చేర్చాం. అందుకోసం నిధులను సైతం ప్రభుత్వం విడుదల చేసింది. కొత్తగా బియ్యం కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు వాలంటీర్లు ఇంటికి వెళ్లి మరీ అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో కేవలం 39 లక్షల మందికి మాత్రమే పింఛన్ అందేది. మేం అధికారంలోకి వచ్చాక ఆ సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఏకంగా 64 లక్షల మందికి అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో పింఛన్ల కోసం చేసిన ఖర్చు కేవలం రూ.400 కోట్లు. ఈ ప్రభుత్వంలో పింఛన్లకే రూ.1,765 కోట్లు ఇస్తున్నాం. దేశంలో రూ. 2,750 నుంచి పదివేల రూపాయల దాకా పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే’ అని సీఎం జగన్ వివరించారు.

Primary Sidebar

తాజా వార్తలు

మోసం చేసిపోతారని ఎన్నడూ అనుకోలేదు!

సువాసనలు వెదజల్లే బాంబు.. ముట్టుకుంటే అంతే సంగతులు !

కేసీఆర్ ను వదలనంటూ.. కోర్టుకెక్కిన పాల్..!

అందుకే అదానీ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చాం….!

ఎన్నికల వేళ హల్ చల్ చేస్తున్న ఆడియో, సీడీలు…!

ముక్కు నేలకు రాస్తా.. బీఆర్ఎస్ కు ఈటల సవాల్..!

సంక్షోభ సమయంలో ఇంటెల్ వినూత్న నిర్ణయం…!

ఆదేశాలు వస్తే.. పోటీ చేసేందుకు సిద్ధమే!

డ్రైనేజీ పనులు చేస్తుండగా గోడ కూలి ఇద్దరు మృతి!

ఓరి వీడి భయం బంగారం గానూ…అమ్మాయిల్ని చూసి..!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

కేసీఆర్ కు షూ చూపిస్తూ షర్మిల సవాల్

ఫిల్మ్ నగర్

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

ఫోటోలు పెట్టింది.. ట్రోలర్స్‌కి చిక్కింది!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap