• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » రాజకీయాలు » రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్

రేపు ఢిల్లీ వెళ్లనున్న ఏపీ సీఎం జగన్

Last Updated: April 4, 2022 at 12:30 pm

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేశాక.. మంత్రివర్గం పునర్ వ్యవస్థీకరణకు ముందు ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత ఏర్పడింది. ఈ పర్యటనలో భాగంగా వెళ్లిన రోజు సాయంత్రమే నేరుగా ప్రధాని మోదీతో ఆయన సమావేశం కానున్నారు. ఇప్పటికే ఈ భేటికి సంబంధించి అపాయింట్ మెంట్ ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ భేటీలో ప్రధాని మోదీ- సీఎం జగన్ మధ్య ఏఏ అంశాలు చర్చకు వస్తాయి అన్నది ఆసక్తికరంగా మారుతోంది. ముందుగా ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు.. మంత్రి వర్గ విస్తరణపై ప్రధాని మోదీకి పూర్తి వివరాలు అందించనున్నట్టు సమాచారం.

అనంతరం రాష్ట్రానికి సంబధించి అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.. పోలవరం సహా పెండింగ్ అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. అలాగే దిశ చట్టం, మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని కూడా విడుదల చేయాలని రిక్వెస్ట్ చేయనున్నారు. ఈ క్రమంలో ఈ భేటీలో ప్రధాని మోదీ-సీఎం జగన్ మధ్య ఏఏ అంశాలు చర్చకు వస్తాయి అన్నది ఆసక్తికరంగా మారుతోంది.

అలాగే, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో జ‌గ‌న్ స‌మావేశం కోసం సీఎంవో అపాయింట్‌మెంట్ కోరింది. దీనిపై హోం శాఖ కార్యాల‌యం స్పందించాల్సి ఉంది. అమిత్ షా అపాయింట్ ఇస్తే ఆయ‌న‌తో కూడా జ‌గ‌న్ స‌మావేశ‌మై ప‌లు అంశాల‌పై చ‌ర్చిస్తారు.

మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హస్తిన పర్యటనలో ఉన్నారు. ఆదివారం రాత్రి ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఇప్పుడు ఏపీ సీఎం కూడా వెళ్లనుండటం ఆసక్తికరంగా మారింది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకేసారి ఢిల్లీకి చేరుకోవడం చర్చనీయాంశమైంది. కేసీఆర్ సైతం ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.. కుదిరితే కేంద్రమంత్రుల్ని కూడా కలిసే అవకాశం ఉంది. అయితే తెలంగాణ సీఎం వైద్య పరీక్షల కోసం హస్తినకు వెళ్లారనే చర్చ జరుగుతోంది.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్..హైద‌రాబాద్ లో క‌ల‌క‌లం..!

ఎమ్మెల్సీ కారులో.. మృతదేహం..!

ఆ అగ్రహీరోలపై కేసులు నమోదు…!

బిహార్ లో వ‌ర‌ద బీభ‌త్సం..!

దిక్సూచిలా.. జనసేన ప్రస్థానం పుస్తక సంకలనాలు..!

దేవి నాగవల్లిని ఇమిటేట్ చేస్తూ…జబర్దస్త్ లో స్కిట్

వారికి సహాయం అందించండి

కీల‌క మ్యాచ్ లో ఆర్సీబీ విజ‌యం.. ఢిల్లీ పైనే ఆధారం..!

వనజీవి రామయ్య మంచి మనసు, ఆ వ్యక్తి వంద మొక్కలు నాటాల్సిందే…!

గుమ్మం ముందు నిమ్మకాయ, ఎండు మిర్చి ఎందుకు కడతారు…?

రెండు ప్రభుత్వాల పాలనల మధ్య మరో తేడా …!

జమ్మూలో కూలిన సొరంగం…!

ఫిల్మ్ నగర్

ఆ అగ్రహీరోలపై కేసులు నమోదు...!

ఆ అగ్రహీరోలపై కేసులు నమోదు…!

devi-nagavalli

దేవి నాగవల్లిని ఇమిటేట్ చేస్తూ…జబర్దస్త్ లో స్కిట్

సర్కారువారి పాట మొదటి వారం వసూళ్లు

సర్కారువారి పాట మొదటి వారం వసూళ్లు

వెంకటేశ్ తో అడవి మనిషి సినిమా ప్లాన్ చేశాడంట

వెంకటేశ్ తో అడవి మనిషి సినిమా ప్లాన్ చేశాడంట

మరోసారి వాయిదాపడిన గాడ్సే

మరోసారి వాయిదాపడిన గాడ్సే

జీ5 తగ్గింది.. మరి అమెజాన్ పరిస్థితేంటి?

జీ5 తగ్గింది.. మరి అమెజాన్ పరిస్థితేంటి?

వెంకటేష్ చెల్లెలిగా పూజా హెగ్డే

వెంకటేష్ చెల్లెలిగా పూజా హెగ్డే

యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ జరిగిన మన స్టార్ హీరోల సినిమాలు ఏవో తెలుసా ?

యాంకర్ సుమ ఇంట్లో షూటింగ్ జరిగిన మన స్టార్ హీరోల సినిమాలు ఏవో తెలుసా ?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)