తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక మంచి స్క్రిప్ట్ రైటర్ అని దుయ్యబట్టారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ లో కేసీఆర్ ఆరోపణల సభ పెట్టారని విమర్శించారు. కేసీఆర్ విస్మరించిన వాగ్ధానాలు, చేసిన తప్పులన్నింటినీ కేంద్రంపై మోపారని ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలపై ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి పంటకు కాళేశ్వరం ద్వారా ఒక ఎకరానికి కూడా నీరు ఇస్తున్నట్లు చెప్పలేదని పేర్కొన్నారు. కృష్ణ నది జలాల్లో 299 టీఎంసీలకు ఒప్పందంపై సీఎం సంతకం పెట్టిన మాట వాస్తవం కాదా? అని ఈ సందర్భంగా ప్రశ్నించారు.
దిండి ప్రాజెక్ట్ కు ఎక్కడి నుంచి నీళ్లు తీసుకుంటారో డీపీఆర్ లో పొందుపర్చారా? అని నిలదీవారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలపై ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి పంటకు కాళేశ్వరం ద్వారా ఒక ఎకరానికి కూడా నీరు ఇస్తున్నట్లు చెప్పలేదని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేస్తామని ప్రధాని మోడీ ఎప్పుడైనా అన్నారా? అని నిలదీశారు.
తెలంగాణలో స్కామ్ లేని స్కీమ్ ఉండదని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వంద కోట్లకు తక్కువ ఉండదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ తరహాలో మద్యంపై నిషేదం పెట్టి, అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే దమ్ము టీఆర్ఎస్ కి ఉందా? అని సవాల్ విసిరారు. అటు ఏపీ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను చాలా వేగంగా పూర్తి చేసిందన్నారు. అందుకే సీఎం కేసీఆర్ సహకరించారని బూర నర్సయ్య గౌడ్ పేర్కొన్నారు.
ఏపీ సీఎంతో కేసీఆర్ కుమ్మక్కై.. తెలంగాణకి అన్యాయం చేశారని ఆరోపణలు చేశారు. తెలంగాణలో ప్రతీ స్కీమ్ వెనుక ఓ స్కామ్ ఉంటుందని నర్సయ్య ఆరోపించారు. కేంద్రంలో ఉన్న సహకారం వల్లే తాను అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. అభివృద్ధి విషయంలో బీజేపీకి భేదాలు లేవన్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రాలేదంటే.. అది రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడం వల్లనేనని పేర్కొన్నారు బూర నర్సయ్య గౌడ్.