కరోనా వ్యాప్తిని నిరోధించడానికి విశేష కృషి చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి, పోలీసు సిబ్బందికి మార్చి నెల పూర్తి వేతనం చెల్లించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
ఈ రెండు శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహం (ఇన్సెంటివ్) కూడా అందించాలని నిర్ణయించారు. ఇన్సెంటివ్ ను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. సీఎం శ్రీ కేసీఆర్ ప్రగతి భవన్ లో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.