విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డు ప్రమాదంపై విచారణకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ప్రకటించారు. ఆంధ్రా యూనివర్సిటీ మెకానికల్ ఇంజినీరింగ్ నిపుణులతో ఒకటి, ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగం నుంచి మరో కమిటీ వేస్తున్నట్టు తెలిపారు.. ఇందుకు సంబంధించి హెచ్ఎస్ఎల్ ఛైర్మన్తో ఇప్పటికే చర్చించినట్టు చెప్పారు.
క్రేన్ ప్రమాదంలో మొత్తం 11 మంది మృతి చెందారని.. ఎవరూ గాయపడలేదని కలెక్టర్ తెలిపారు. క్రేన్ ఆపరేషన్, మేనేజ్మెంట్లో మొత్తం మూడు కాంట్రాక్ట్ కంపెనీలు ఉన్నాయని… మృతుల్లో నలుగురు హెచ్ఎస్ఎల్ ఉద్యోగులు కాగా.. మిగిలిన ఏడుగురు కాంట్రాక్ట్ ఏజెన్సీలకు చెందినవారని వెల్లడించారు.