• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » Telangana » ప్రధాని మాతృమూర్తి మరణంపై తెలుగు రాష్ట్రాల ప్రముఖుల సంతాపం…!

ప్రధాని మాతృమూర్తి మరణంపై తెలుగు రాష్ట్రాల ప్రముఖుల సంతాపం…!

Last Updated: December 30, 2022 at 3:55 pm

ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ కన్ను మూశారు. ఆమె మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు. ప్రధానికి, వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు కూడా మోడీ తల్లి మృతి పట్ల సంతాపం తెలిపారు.

ప్రధాని తల్లి మరణం పట్ల సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీకి, ఆయన కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. హీరాబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ప్రధాని తల్లి హీరాబెన్ ఆ దేవుడి పాదాలను చేరుకున్నారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. హీరాబెన్ మృతి పట్ల ఆమె తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు. ప్రధానికి జరిగిన ఈ నష్టానికి ఈ దేశ ప్రజలంతా అండగా ఉంటారని గవర్నర్ ట్వీట్ చేశారు.

ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ కూడా సంతాపం తెలిపారు. ప్రధాని మాతృమూర్తి మరణ వార్త తనను తీవ్రంగా కలిచి వేసిందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తల్లీ బిడ్డల మధ్య ఉండే బంధం వెల కట్టలేనిదని ఆయన వివరించారు. ఈ సృష్టిలో ఇంతకన్నా విలువైనది ఏదీ లేదని చెప్పారు. హీరాబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన దేవున్ని ప్రార్థించారు.

ప్రధాని తల్లి హీరాబెన్ స్వర్గస్తులయ్యారని తెలియడంతో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మొదటి దైవం, తొలి గురువు అయిన మాతృమూర్తిని కోల్పోతే ఉండే దుఖం తనకు తెలుసని చెప్పారు. ఈ విచారకరమైన సమయంలో ప్రధానికి, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు ట్వీట్ చేశారు.

ప్రధాని తల్లి హీరాబెన్ మృతి వార్త తనను తీవ్రంగా కలిచి వేసిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ బాధాకరమైన సమయంలో ప్రధాని కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రధాని మోడీ తల్లి హీరా బెన్ మృతికి మెగాస్టార్ చిరంజీవి సంతాపం తెలిపారు. ప్రధాని మోడీ ప్రియమైన తల్లి హీరాబెన్ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె అసాధారణమైన జీవితాన్ని గడిపారని చిరంజీవి తెలిపారు. స్వర్గలోకానికి బయలు దేరిన ఆమె ఆత్మకు ఆయన నివాళులర్పించారు.

Primary Sidebar

తాజా వార్తలు

నగరానికి చేరుకున్న యువ క్రికెటర్లు!

రంగంలోకి దిగిన ఆర్బీఐ.. స్థానిక బ్యాంకులతో టచ్ !

నగ ఎత్తుకెళ్ళిన నాటీ ఎలుక…!

దాని పై దృష్టి పెడితే భారత్ నెం.1

ఎలాంటి విచారణ అయినా సిద్ధమే!

ఉభయ సభల్లో బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు

రైట్‌ హ్యాండ్ నుంచి లెఫ్ట్‌ హ్యాండ్‌!

రేపటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

భద్రాచలంలో బూజు పట్టిన లడ్డూలు..మెమోలిచ్చిన ఈవో!

పార్లమెంటును తాకిన ‘అదానీ సెగ’.. మధ్యాహ్నం వరకు వాయిదా

ఇక పై చెప్పం.. మంత్రి సీరియస్ వార్నింగ్‌!

ఫిల్మ్ నగర్

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

సీనియర్‌ డైరెక్టర్‌ సాగర్‌ మృతి!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

ప్రభాస్ ప్రాజెక్ట్ కె.. అది ఫేక్ న్యూస్..!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

త్వరలోనే సూర్య 42 సినిమా టైటిల్‌!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

14 ఏళ్ల తరువాత విజయ్‌ తో త్రిష!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

కియారా పెళ్లి ముహూర్తం ఫిక్స్‌!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

చీరకట్టులో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న బుట్టబొమ్మ..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన  విజయ్ దేవరకొండ,రష్మిక..!

దుబాయ్ లో జంటగా దర్శనమిచ్చిన విజయ్ దేవరకొండ,రష్మిక..!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి... !!

ఇన్నాళ్ళకు సోషల్ మీడియాలో మెరిసిన సాయిపల్లవి… !!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap