రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో బీజేపీ ఎంపీటీసీలు ఆందోళనకు దిగారు. స్థానిక మండల కార్యాలయంలో సర్వ సభ్యమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ ఎంపీటీసీలు నిరసన దిగారు.
రామాలయం భూములను కబ్జా చేసిన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ నిరసన తెలిపారు బీజేపీ ఎంపీటీసీలు. దీంతో సమావేశం నుండి బీజేపి ఎంపీటీసీలను పోలీసులు బలవంతంగా బయటకు లాక్కెళ్లారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళన చేపట్టారు.
అక్రమంగా వెంచర్లు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మండల సర్వ సభ్య సమావేశంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది. ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు.