దీపావళి పండుగకు భారతదేశంలో ఎంతో విశిష్టత ఉంది. అన్ని మతాల వారు దీపావళి పండుగను వేడుకలా చేసుకుంటారు. కులమతాలకు అతీతంగా ప్రతిఒక్కరూ దీనికి జరుపుకుంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిఒక్కరూ టపాసులు కాలుస్తూ పండుగ జరపుకుంటారు. పండుగ రోజు చాలామంది లక్ష్మిదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. దీపావళి పండుగ రోజు లక్ష్మిదేవిని పూజిస్తే మంచి జరుగుతుందనేది చాలామంది నమ్మకం.
ఈ ఏడాది క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 25న దీపావళి వస్తుంది. కానీ ఆ రోజు సాయంత్రం 5.11 గంటల నుంచి 6.27 గంటల వరకు సూర్యగ్రహణం ఏర్పడుతుందని పండితులు చెబుతున్నారు. ఆ రోజు అమావాస్య వెళ్లిపోయి పాడ్యమి వస్తుందని, అమావాస్య ఘడియలు వెళ్లిపోతాయి కాబట్టి పండుగ జరుపుకోవడం కరెక్ట్ కాదని జ్యోతిష్య పండితులు అభిప్రాయపడుతున్నారు. 24న రాతంత్రా అమావాస్య గడియలు ఉంటాయి కాబట్టి ఆ రోజే పండుగ జరుపుకోవడం సరైనదని పండితులు చెబుతున్నారు.
24న ఉదయం చతుర్దశి ఉంటుందని, రాతంత్రా అమవాస్య కొనసాగుతుందని చెబుతున్నారు.24న లక్ష్మీదేవికి పూజ చేసి రాత్రి టపాసులు పేల్చి పండుగ జరుపుకోవాలని సూచిస్తున్నారు. క్యాలెండర్ ప్రకారం 25న పండుగ ఉండటం, పండితులు 24న జరుపుకోవాలని సూచిస్తుండటంతో.. దీపావళి పండుగ తేదీలపై అయోమయం ఏర్పడింది. ఏ రోజు పండుగ జరుపుకోవాలనే దానిపై ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. పండుగ ఒక రోజు అయినప్పటికీ.. దేశ ప్రజలు మూడు రోజుల పాటు దీపావళి జరుపుకుంటారు. పండుగ రోజు కాకుండా మిగతా రెండు రోజులు కూడా ఇంటి ముందు దీపాలు వెలిగించి టపాసులు కాల్చే సాంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతోంది.
చిన్నపిల్లలైతే దీపావళికి వారం రోజుల ముందు నుంచే టపాసులు కాల్చుతూ సందడి చేస్తూ ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 25వ తేదీనే దీపావళి సెలవుగా ప్రకటించాయి. కానీ 24వ తేదీనే పండుగ జరుపుకోవాలని పండితులు సూచిస్తుండటం విశేషం.