హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమాన ల్యాండింగ్ విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఎయిర్ పోర్టులో ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో గమ్యం చేరుకున్నాము అనుకున్నప్రయాణికులకు గట్టిగా షాక్ తగిలింది. క్షణాల్లో దిగే సమయంలో ఒక్కసారిగా విమానం టేకాఫ్ కావడంతో.. భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు.
కాసేపు తరువాత మళ్లీ ఫైలెట్ విమానం సేఫ్ గా లాండింగ్ చేయడంతో.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. విమానం వైజాగ్ నుండి హైదరాబాద్ కు బయలుదేరింది. అక్కడి నుంచి సేఫ్ గానే బయలు దేరిన విమానానికి ఏం జరిగిందో తెలియదు కానీ ఫైలెట్ విమానం రన్ వే పై ల్యాండ్ అవుతూనే క్షణాల్లో మళ్లీ టేకాఫ్ తీసుకున్నాడు. ఫైట్ రన్ వే పై దిగకుండా టేక్ ఆఫ్ కావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. కాసేపు ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు.
పైలెట్ ఎందుకు మళ్లీ టేక్ ఆఫ్ చేశాడనేది వారికి కాసేపు గుండె ఆగినట్లు అయ్యింది. ఏదైనా ప్రమాదంలో ఉన్నామా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్న సమయంలో మళ్లీ ఐదు నిమిషాల తర్వాత విమానం సేఫ్ గా లాండింగ్ చేశాడు పైలెట్. ఫ్లైట్ సేఫ్ గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ సమయంలో రన్ వే పై విజిబిలిటీ సరిగ్గా లేకపోవడంతోనే ఇబ్బంది ఎదురైందని ప్రయాణికులకు క్లారిటీ ఇచ్చారు. ఎవరికి ఏమీ ప్రాణహానీ జరగలేదని వెల్లడించారు. విజిబిలిటీ సరిగ్గా లేనందువల్లనే ఇలా జరిగిందని తెలిపారు.