• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » తెలంగాణ దశాబ్ది వేడుకలు.. బీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్

తెలంగాణ దశాబ్ది వేడుకలు.. బీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్

Last Updated: May 26, 2023 at 6:48 pm

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సర్కార్ కు ధీటుగా టీ కాంగ్రెస్ కూడా తెలంగాణ దశాబ్ది వేడుకలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రతీ నెలా మొదటి వారంలో పీఏసీ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

congress leader madhu yashki on telangana state formation day celebrations

బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై 20 రోజులు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ వైఫల్యాలపై.. ఫెయిల్యూర్ కేసీఆర్.. స్లోగన్ తో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు మధు యాష్కీ వెల్లడించారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి పాలాభిషేకం చేసి.. కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పారు. 20 రోజులు కాంగ్రెస్ కార్యకర్తలు ఇళ్లపై జెండాలు ఎగరేయాలని పిలుపునిచ్చారు మధు యాష్కీ.

అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్లుండి మోడీ పార్లమెంట్ భవనం ప్రారంభిస్తున్నారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన అని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎలా ఉండాలని చెప్పేది ఆర్టికల్ 79, 84 అని, పార్లమెంట్ అనేది రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్ సభ, ఫౌండింగ్ మెంబర్స్ అని తెలిపారు. రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం సరికాదన్నారు ఉత్తమ్.

కనీసం శంకుస్థాపనకు కూడా పిలవలేదని మండిపడ్డారు. రాష్ట్రపతికి ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మోడీ ఇప్పటివరకు ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పలేదని, పార్లమెంట్ అతి తక్కువ రోజులు పని చేసింది మోడీ హయాంలోనేనని విమర్శలు గుప్పించారు. కొత్త బిల్లులపై అసలు చర్చ అనేదే ఉండదన్నారు. పార్లమెంట్ అందరిదని, మోడీ ఒక్కరిదే కాదని మండిపడ్డారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

Primary Sidebar

తాజా వార్తలు

మహాకాల్ లోక్ కారిడార్ లో కుప్ప కూలిన ‘సప్తర్షి విగ్రహాలు’

నెట్టింట్లో రచ్చ చేస్తున్న బెంగుళూరు పొడి ఇడ్లీ…!

పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరటం కష్టం: ఈటల

దొంగలను పట్టుకునేందుకు పోలీసుల చేజ్…కానీ..!

కులవృత్తిదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

మధ్యప్రదేశ్ మాదే.. రాహుల్ గాంధీ

నా ఇంటికి దారి ఇప్పించండి!

హజ్ యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు: మంత్రి కొప్పుల

పవన్ వేసుకున్న షూ ధర ఎంతంటే!

సీతారాముల ఎడబాటు పాటగా…ఆదిపురుష్ న్యూసాంగ్..!

అబద్ధాల్లో బాబుకు గిన్నిస్ రికార్డు: సజ్జల!

ఐదు నెలల తరువాత కాంగ్రెస్ దే అధికారం!

ఫిల్మ్ నగర్

power star pawan kalyan shoe cost is trending in social media

పవన్ వేసుకున్న షూ ధర ఎంతంటే!

సీతారాముల ఎడబాటు పాటగా...ఆదిపురుష్ న్యూసాంగ్..!

సీతారాముల ఎడబాటు పాటగా…ఆదిపురుష్ న్యూసాంగ్..!

SreeLeela in an international Movie

ఇంటర్నేషనల్ సినిమాలో శ్రీలీల

New rumors on kushi Movie

ఖుషీ కథ కాపీ కొట్టారా?

ఒకప్పుడు వాన...ఇప్పుడు నిప్పు..శాపంగా మారిన వీరమల్లు సెట్..!

ఒకప్పుడు వాన…ఇప్పుడు నిప్పు..శాపంగా మారిన వీరమల్లు సెట్..!

Teja Announced another casting call

మరో 45 మంది కొత్తవాళ్లకు అవకాశం

What is happening in UV creations

అసలు ‘యూవీ’ లో ఏం జరుగుతోంది?

People Media another movie with Prabhas

ప్రభాస్ తో పీపుల్ మీడియా మరో సినిమా

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap