మల్లు రవి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు
దళిత బంధు అంటూ కేసీఆర్ మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారు. ఆయన దళిత బంధువు కాదు శత్రువు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ మొదటి సంతకం అంబేద్కర్ ప్రాణహిత పేరు మార్చేందుకు పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ మీద పెట్టింది. పంజాగుట్ట దగ్గర అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి చెత్తలో పడేశారు కేసీఆర్. ఇంతవరకు అక్కడ మళ్ళీ కొత్తది ఏర్పాటు చేయలేదు.
ఎన్నికల సమయంలో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని మోసం చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. చట్ట ప్రకారం రావాల్సిన రూ.65 వేల కోట్ల నిధులు ఖర్చు చేయకుండా నష్టం చేశారు. ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక ముందు దళిత బంధు అంటూ మళ్లీ మోసం చేస్తున్నారు.
దళితులను ఏడేళ్లుగా మోసం చేస్తూ, నష్టం చేస్తూ మాయమాటలు చెప్పి లబ్ధి పొందుతున్న కేసీఆర్.. ముమ్మాటికీ దళితుల శత్రువే. ఈ విషయాన్ని దళితులందరూ అర్థం చేసుకొని ఆయనకు తగిన బుద్ధి చెప్పాలి.