బీజేపీకి లాభం చేసేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ వీ హనుమంతరావు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీతో కేసీఆర్ ఫైట్ డూప్ ఫైట్ మాత్రమేనన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అని కేసీఆర్ చెబుతున్నా మాటల్లో వాస్తవం లేదన్నారు.
దేశంలో కేసీఆర్ కు ఏ పార్టీ కూడా సహకరించదని ఆయన చెప్పారు. తెలంగాణలో రైతులకు బేడీలు వేయించిన చరిత్ర కేసీఆర్ ది అంటూ వీహెచ్ మండి పడ్డారు. తెలంగాణ ప్రజల సొమ్మును దేశంలో ఇతర రాష్ట్రాల రైతులకు పంచారని అన్నారు. ప్రజల సొమ్ముతో విమానాలు కొంటున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో ఏమీ చేయలేని కేసీఆర్ దేశంలో ఏదో చేస్తానంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు వీహెచ్. కేసీఆర్ వ్యక్తి గత రాజకీయ లబ్ధి కోసమే జాతీయ పార్టీ అంటూ ఆరోపించారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని సోనియాను మోసం చేసిన చరిత్ర కేసీఆర్ ది అంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రంలో సంపాదించిన సొమ్మును దేశంలో ఖర్చు చేస్తారని ఆయన విమర్శించారు. దేశం కేసీఆర్ ను పిలుస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్న నాయకుల మాటలు హాస్యాస్పదమంటూ ఎద్దేశా చేశారు కాంగ్రెస్ సీనియర్ వీ హనుమంతరావు.