సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిప్పులు చెరిగారు. రైతు దీక్షను చూసి తట్టుకోలేక కేసీఆర్ అహంకారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు జగ్గారెడ్డి. కేసీఆర్ అహంకారమే ఆయన పతనానికి దారితీస్తుందని విమర్శించారు. కుర్చీ పోయిన తెల్లారి నిన్ను కుక్కలు కూడా పట్టించుకోవని విమర్శలు ఎక్కుపెట్టారు. పదవిపోయిన తెల్లారి నీ కుటుంబ సభ్యులెవరు నీ వెంట ఉండరన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వడం వల్లనే నీవు సీఎం అయ్యావని సోనియా ను ఒప్పించి తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ నాయకులు బఫ్యూన్ గాళ్ళు అయ్యారా అంటూ ప్రశ్నించారు.
తిన్నింటి వాసాలు లెక్కబెట్టే వ్యక్తి కేసీఆర్ అంటూ మండిపడ్డారు. రైతు సమస్యలు మాట్లాడితే చిల్లగాళ్ల, చిల్లరగాళ్లని రైతులను అవమాణిస్తారా అంటూ నిలదీశారు. ప్రగతి భవన్ లో మీరు ఉన్నట్టు రైతులందరూ సుకంగా లేరని.. తాగండి, సావండి, ఖజానా నింపండి, అన్నట్లుగా ఉంది కేసీఆర్ వైఖరి ఉందని విమర్శలు ఎక్కుపెట్టారు.