• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » 2024 ఎన్నికలకు రోడ్ మ్యాప్ ! కాంగ్రెస్ ప్లీనరీ నిర్ణయం?

2024 ఎన్నికలకు రోడ్ మ్యాప్ ! కాంగ్రెస్ ప్లీనరీ నిర్ణయం?

Last Updated: February 24, 2023 at 10:53 am

2024 ఎన్నికలకు రోడ్ మ్యాప్ రూపకల్పనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ శుక్రవారం ఛత్తీస్ గఢ్ రాజధాని నవా రాయ్ పూర్ లో జరగనుంది. మూడు రోజులపాటు నిర్వహించే ఈ 85 వ ప్లీనరీలో పార్టీ ముందున్న అనేక సవాళ్లపై చర్చించి తీర్మానాలను రూపొందించనున్నారు. ఈ సెషన్ కి ఎజెండాను నిర్ణయించడానికి స్టీరింగ్ కమిటీ సమావేశమయింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు నిర్వహించాలా లేదా అన్న దానిపై ఈ కమిటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు నిర్వహించే బదులు ఈ కమిటీకి సభ్యులను నామినేట్ చేసే అధికారాన్ని పార్టీ ప్రెసిడెంట్ కు అప్పగించాలని మెజారిటీ సభ్యులు కోరుతున్నారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం ఎన్నికలు నిర్వహించి కొత్త సిడబ్ల్యుసిని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు

Congress plenary session begins today; Gandhis may skip key meet: 10 points  | Latest News India - Hindustan Times

ఎన్నికలు జరగని పక్షంలో 25 మంది సభ్యులకు గాను 23 మందిని పార్టీ ప్రెసిడెంట్ నామినేట్ చేస్తారు.. రాయ్ పూర్ ప్లీనరీకి రాహుల్, సోనియా గాంధీ శుక్రవారం మధ్యాహ్నం నుంచి హాజరు కావచ్చునని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షునిగా మల్లిఖార్జున్ ఖర్గే నియామకాన్ని ప్లీనరీలో ఏకగ్రీవంగా ఆమోదించే సూచనలున్నాయి. బీజేపీని ఎదుర్కోవడానికి భావ సారూప్యం గల పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు అవసరమైన వ్యూహాన్ని ఈ సమావేశాల్లో ఖరారు చేయవచ్చు.

దాదాపు 15 వేలమంది డెలిగేట్లు ప్లీనరీకి హాజరవుతారని అంచనా.. విపక్షాల మధ్యఐక్యతకు కృషి చేయాలని, ఈ ఏడాది 9 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి తగిన వ్యూహాలను రూపొందించాలని. లోక్ సభ ఎన్నికలకు ముందు కనీసం కొన్ని రాష్ట్రాల్లోనైనా విజయం సాధించడం ముఖ్యమని పార్టీ భావిస్తోంది.

కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసి.. ‘స్టేట్ పోల్ సైకిల్’ ని రూపొందించాలని కూడా పార్టీ ప్లీనరీలో నిర్ణయించే అవకాశాలున్నాయి. ఇక అరుణాచల్ ప్రదేశ్ నుంచి గుజరాత్ వరకు మరో పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఓ ప్లాన్ ని ప్లీనరీ తయారు చేయవచ్చు.

Primary Sidebar

తాజా వార్తలు

పార్లమెంట్ లో రాహుల్ ‘సునామీ’ !

నాన్న రామ్ చరణ్ నిన్ను చూసి గర్విస్తున్నాను!

సుశాంత్ సింగ్ స్మృతుల్లో స్మృతి.. కంటతడి

ఏప్రిల్‌ 8న హైదరాబాద్‌కు మోడీ!

గేమ్‌ ఛేంజర్‌గా వస్తున్న చరణ్‌!

ఢిల్లీ బీజేపీ లీగల్ సెల్ కో-కన్వీనర్ బాన్సురీ స్వరాజ్

చెల్లికి రూ.8 కోట్ల కట్నం ఇచ్చిన సోదరులు!

గాంధీజీకి డిగ్రీ లేదా? తుషార్ గాంధీ ఫైర్

ప్రముఖ నటుడి కన్నుమూత!

గాల్లో ఎదురెదురుగా రెండు విమానాలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం..!

ఆస్పత్రికి తాళం వేసి… పానీ పూరీ దుకాణం పెట్టిన డాక్టర్..!

మరో రెండు రోజులు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్…!

ఫిల్మ్ నగర్

chiranjivi birthday wishes to ram charan

నాన్న రామ్ చరణ్ నిన్ను చూసి గర్విస్తున్నాను!

ramcharan rc15 movie title announced as game changer

గేమ్‌ ఛేంజర్‌గా వస్తున్న చరణ్‌!

malayalam actor former loksabha mp innocent passed away

ప్రముఖ నటుడి కన్నుమూత!

సైంధవ్ లో వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ హీరోయిన్

సైంధవ్ లో వెంకటేష్ సరసన జెర్సీ ఫేమ్ హీరోయిన్

ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

ఐటెమ్ సాంగ్ తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్

గాల్లో తేలిపోతున్న లావణ్య.. కొత్త ఫొటోలు వైరల్

గాల్లో తేలిపోతున్న లావణ్య.. కొత్త ఫొటోలు వైరల్

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. న్యూ మూవీ బిగ్ అప్ డేట్

మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. న్యూ మూవీ బిగ్ అప్ డేట్

Bhojpuri actress Akanksha Dubey 'dies by suicide' in Varanasi hotel - The  Economic Times

వారణాసిలో భోజ్ పురి నటి ఆత్మహత్య

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap