• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Top News » కర్ణాటక ఎన్నికల్లో మహిళల కోసం కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో ?

కర్ణాటక ఎన్నికల్లో మహిళల కోసం కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టో ?

Last Updated: January 9, 2023 at 7:45 pm

కర్ణాటక ఎన్నికల్లో మహిళల ఓట్లను చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహానికి శ్రీకారం చుట్టింది. కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా మేనిఫెస్టోను రూపొందించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ నెల 16 న రాష్ట్రాన్ని సందర్శించి మహిళల సభలో ప్రసంగిస్తారని కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీ.కె. శివకుమార్ తెలిపారు. ఆ సందర్భంగా ఆమె ఈ మేనిఫెస్టో ను విడుదల చేస్తారని ఆయన చెప్పారు. . రానున్న ఏప్రిల్-మే నెలల్లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న దృష్ట్యా.. మహిళల ప్రయోజనాలకు ఉద్దేశించిన ‘గ్యారంటీ లెటర్’ ని సైతం ప్రియాంక గాంధీ రిలీజ్ చేస్తారని అన్నారు. .ఈ మేనిఫెస్టో, గ్యారంటీ లెటర్ పై నేతలందరి సూచనలు, సలహాలను ఈ నెల 15 వరకు ఆహ్వానిస్తున్నామని శివకుమార్ చెప్పారు.

Priyanka Gandhi To Address Congress's Women's Convention In Bengaluru On Jan 16

రామనగర, మాండ్యా జిల్లాలకు చెందిన జేడీ-ఎస్ నేతలు విశ్వనాథ్ , రాధాకృష్ణ తమ సహచరులతో వచ్చి సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా శివకుమార్ మీడియాతో మాట్లాడారు. వీరిలో విశ్వనాథ్ లోగడ జరిగిన ఎన్నికల్లో కనకపుర అసెంబ్లీ నియోజకవర్గంలో శివకుమార్ పై పోటీ చేశారు. దేశ జనాభాలో మహిళలు 50 శాతం మంది ఉన్నారని, వీరి ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వవలసి ఉందని శివకుమార్ చెప్పారు.

వీరిలో నాయకత్వ లక్షణాలను పెంచవలసి ఉందని అందువల్లే తమ పార్టీ దీనిపై దృష్టి పెట్టిందని పేర్కొన్నారు. బెంగుళూరులోని ప్యాలస్ గ్రౌండ్ లో జనవరి 16 న జరిగే సభలో పంచాయతీ స్థాయి నుంచి సొసైటీ స్థాయి వరకు మహిళా నేతలంతా పాల్గొంటారన్నారు.

ఈ సభకు జాతీయ నాయకులు కూడా హాజరవుతారని శివకుమార్ చెప్పారు. రాజకీయంగా, విద్యా పరంగా, ఆర్ధిక పరంగా.. ఇంకా సామాజిక పరంగా కూడా మహిళలను మరింత బలోపేతం చేయాలన్నదే కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు. కర్ణాటకను ప్రియాంక ‘రాజకీయంగా విజిట్’ చేయడం ఇదే మొట్టమొదటిసారి. మహిళా సాధికారతకు ఆమె అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు శివకుమార్ చెప్పారు. త్వరలో తాను, పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తామని ఆయన తెలిపారు.

Primary Sidebar

తాజా వార్తలు

తండ్రికి తగ్గ తనయుడు.. హిమాన్షుపై ప్రశంసలు..!

ముగిసిన ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ

హిండెన్ బర్గ్ రిపోర్ట్: కేటీఆర్, కవితల రియాక్షన్

ముందస్తు హింట్.. సెంట్రల్ కు స్ట్రయిట్ సవాల్

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలి

ప్రచారం, ప్రకటనలపై ఏ పార్టీ ఎంత ఖర్చు చేసిందంటే…!

వేలాది మంది భర్తలను కటాకటాల్లోకి నెడతాం….!

మరి మిగతా ధర్మాల మాటేమిటి… సీఎం యోగిపై కాంగ్రెస్ నేత ఫైర్…!

రవితేజ ఉండే ఇల్లు ఖరీదు ఎంతో తెలుసా…?

విజయసాయి రెడ్డికి, తారకరత్నకు ఉన్న రిలేషన్ తెలుసా…?

జమున ఆస్తులు ఎన్నో తెలుసా…?

రజనీ కాంత్ కి ఆ రెండు అలవాట్లు ఉండేవా…? లతా వచ్చిన తర్వాత ఏం జరిగింది…?

ఫిల్మ్ నగర్

ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం!

ఇంకా విషమంగానే తారకరత్న ఆరోగ్యం!

తారకరత్నకు ఎక్మో వైద్యం.. సాయంత్రం బెంగళూరుకి చంద్రబాబు, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌!

తారకరత్నకు ఎక్మో వైద్యం.. సాయంత్రం బెంగళూరుకి చంద్రబాబు, ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌!

వసూళ్లను 'హంట్' చేయలేకపోయింది!

వసూళ్లను ‘హంట్’ చేయలేకపోయింది!

దసరా 2 భాగాలుగా వస్తోందా?

దసరా 2 భాగాలుగా వస్తోందా?

పవన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

పవన్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

బుల్లితెరపై మెరిసిన గాడ్ ఫాదర్

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

ధోనీ కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు!

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

అన్ స్టాపబుల్-2: మూడు పెళ్లిళ్ల గొడవ ఏంటయ్యా?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap