• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయా..? వాయిదా పడతాయా..?

ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయా..? వాయిదా పడతాయా..?

Last Updated: December 24, 2021 at 5:06 pm

కరోనా మహమ్మారి నుంచి దేశం కోలుకుంటోంది అనుకునే టైమ్ లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎంట్రీ ఇచ్చింది. మెల్లమెల్లగా ఒక్కో రాష్ట్రానికి పాకుతున్న ఈ మహమ్మారి.. రానున్న రోజుల్లో థర్డ్ వేవ్ కు దారి తీయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి 350కి పైనే ఉన్న కేసుల సంఖ్య.. అంతకంతకూ పెరిగే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు. సరిగ్గా ఇదే టైమ్ లో అలహాబాద్ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఒమిక్రాన్ తీవ్రతపై ఆందోళన వ్యక్తం చేసిన హైకోర్టు.. ఇంకొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను కొంతకాలం వాయిదా వేయాలని ఎలక్షన్ కమిషన్ కు సూచించింది న్యాయస్థానం. అలాగే.. కేసులు పెరుగుతున్న కారణంగా ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించాలని ప్రధాని మోడీకి తెలిపింది. ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ జీవించే హక్కు ఉందని.. ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం సరికాదని అభిప్రాయపడింది. వాటికి అనుమతిస్తే యూపీలో ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్యలో నమోదయ్యే అవకాశముందని హెచ్చరించింది. ఎన్నికలను రెండు నెలల పాటు వాయిదా వేయాలని కోరింది.

ఎలక్షన్ కు కొద్ది రోజులే ఉండడంతో.. యూపీ సహా మిగిలిన గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్, పంజాబ్ రాష్ట్రాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి పార్టీలు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాయి. యూపీ ప్రభుత్వం.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జయంతి డిసెంబర్ 25న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేసింది. కోటి మంది విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ ఫోన్స్, ట్యాబ్లెట్స్ ఇవ్వాలని నిర్ణయించింది. తొలి దశలో భాగంగా లక్ష మందికి శనివారం సీఎం యోగి ఆదిత్యనాథ్‌ వాటిని పంపిణీ చేయనున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

Primary Sidebar

తాజా వార్తలు

వ‌జ్రోత్స‌వ ర్యాలీ కాస్త సినిమా ర్యాలీ అయ్యిందిగా!!

జాతీయ జెండా ఆవిష్కరించిన బండి సంజయ్

పాదయాత్రకు రేవంత్ దూరం

ప్రేమ క‌థ చెప్పిన ఉప ముఖ్య‌మంత్రి!!

మునుగోడు రణంలో ఒక్కొక్కరుగా..

తగ్గేదే లేదంటున్న కోమటిరెడ్డి..దయాకర్ మరో‘సారీ’

ప‌వ‌ర్ స్టార్ జ‌ల్సా రీ రిలీజ్‌!!

బీసీ నినాదంతో రెడ్డిగారికి చెక్ పెడతారా..?

జాతీయ జెండా నియమాలు.. తెలుసుకోండి!

ఆత్మ‌హ‌త్య చేసుకుంటే మోక్షం వ‌స్తుంద‌ని న‌మ్మి…!!

మునుగోడులో పోస్టర్ల కలకలం

ఆమె ప‌క్క‌న ఉంటే ఎంత దూరం అయిన వెళ్లొచ్చు!!

ఫిల్మ్ నగర్

ప‌వ‌ర్ స్టార్ జ‌ల్సా రీ రిలీజ్‌!!

ప‌వ‌ర్ స్టార్ జ‌ల్సా రీ రిలీజ్‌!!

ఆమె ప‌క్క‌న ఉంటే ఎంత దూరం అయిన వెళ్లొచ్చు!!

ఆమె ప‌క్క‌న ఉంటే ఎంత దూరం అయిన వెళ్లొచ్చు!!

రెండో రోజే 1300 షోలు క్యాన్సిల్‌!!

రెండో రోజే 1300 షోలు క్యాన్సిల్‌!!

అల్లు అర్జున్ స్టెప్ వెనుక రహస్యం చెప్పిన అమితాబ్

అల్లు అర్జున్ స్టెప్ వెనుక రహస్యం చెప్పిన అమితాబ్

హతవిధీ.. మరోసారి చిరంజీవిపై ట్రోలింగ్

హతవిధీ.. మరోసారి చిరంజీవిపై ట్రోలింగ్

బాబోయ్ బాలీవుడ్.. హిందీ చిత్రసీమకు ఏమైంది?

బాబోయ్ బాలీవుడ్.. హిందీ చిత్రసీమకు ఏమైంది?

బ్లాక్ బస్టర్ బింబిసార.. మొదటి వారం వసూళ్లు ఇవే

బ్లాక్ బస్టర్ బింబిసార.. మొదటి వారం వసూళ్లు ఇవే

మాచర్ల నియోజకవర్గం రివ్యూ

మాచర్ల నియోజకవర్గం రివ్యూ

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)