• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

భారత్ లో పెరిగిన కరోనా బాధితులు..చైనాలో జీరో

Published on : March 19, 2020 at 10:55 am

కరోనా వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ దశకు చేరడంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య  మరింత పెరిగింది. చనిపోయిన ముగ్గురితో కలుపుకొని ఇప్పటి వరకు 169 కేసులు నమోదయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ నియంత్రించడానికి ప్రభుత్వం ప్రజలకు సూచనలు చేసింది. ప్రజలు వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే బయటకు వెళ్లాలని లేకపోతే ఇంట్లోనే ఉండాలని సూచించింది. జమ్మూ కశ్మీర్ లో మొదటి కరోనా కేసు నమోదైంది. ఢిల్లీలో 20 ఏళ్ల యువకుడికి వైరస్ టెస్ట్ పాజిటివ్ గా తేలింది. తమిళనాడులోనూ వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. తనకు కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో ఢిల్లీలో బుధవారం  ఓ వ్యక్తి ఏడంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

కరోనా ఆందోళనల నేపధ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం రాత్రి 8 గంటలకు ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. బుధవారం అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని వైరస్ నియంత్రణపై సమీక్ష నిర్వహించారు.

గత రెండు వారాలుగా పలు రాష్ట్రాలు విద్యా సంస్థలు, మాల్స్, సినిమా హాళ్లు మూసివేశాయి. ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడే సభలు, సమావేశాలను రద్దు చేశాయి. ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని సూచించాయి. వైరస్ లక్షణాలుండి తప్పించుకొని తిరుగుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. మలేషియా లోని కౌలాలంపూర్ లో చిక్కుకున్న 405 మంది భారతీయ విద్యార్ధులను ఇండియాకు రప్పించినట్టు కౌలాలంపూర్ లోని ఇండియన్ హై కమిషనర్ తెలిపారు.

చైనాలో మొదటిసారిగా గురువారం ఒక్క పేషెంట్ కూడా నమోదు కాలేదు. వైరస్ వ్యాపించాక  ఆ దేశంలో ఒక్క స్వదేశీ పేషెంట్ కూడా నమోదు కాకపోవడం ఇదే మొదటిసారి. అయితే ఆ దేశంలో ఉన్న విదేశీ పేషెంట్ల వల్ల ఆందోళనలు నెలకొన్నాయి. గతంలో 81000 మంది ఈ వైరస్ బారిన పడగా ఇప్పుడు 7263 మంది బాధితులు మాత్రమే ఉన్నారు.

ఇండియా ముందస్తు చర్యలు భేష్ :

వైరస్ ను కట్టడి చేయడానికి భారతదేశం అంకితభావంతో తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది.  ప్రధాన మంత్రి మొదలు కొని కింది స్థాయి వరకు అందరూ తీసుకుంటున్న చర్యలు చాలా బాగున్నాయి. ఈ కారణంగానే ఇండియాలో వైరస్ వ్యాప్తిని  నియంత్రించగలుగుతున్నారని భారత్ లోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి హెంక్ బేక్ డమ్ అన్నారు.

గత ఏడాది డిసెంబర్ లో చైనాలోని వుహాన్ సీ పుడ్ మార్కెట్ లో ప్రబలిన కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. వేలాది మందిని బలి తీసుకుంది. లక్షలాది మందికి వైరస్ సోకింది. కోట్లాది మందిని క్వారంటైన్లకు పరిమితం చేసింది. పలు దేశాల జన జీవనాన్ని అస్తవ్యస్థం చేసింది. ఆర్ధిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేసింది.

tolivelugu app download

Filed Under: వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

పుష్ప ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామ‌

పుష్ప ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామ‌

బుల్లెట్ పై ప‌వ‌న్- షూటింగ్ వీడియో వైర‌ల్

బుల్లెట్ పై ప‌వ‌న్- షూటింగ్ వీడియో వైర‌ల్

ర‌వితేజ బ‌ర్త్ డే- ఖిలాడీ టీం విషెష్ అదిరిపోయిందిగా..!(వీడియో)

ర‌వితేజ బ‌ర్త్ డే- ఖిలాడీ టీం విషెష్ అదిరిపోయిందిగా..!(వీడియో)

చైతూ కోసం త‌న సినిమా విడుద‌ల‌ వాయిదా వేసుకున్న నాని?

చైతూ కోసం త‌న సినిమా విడుద‌ల‌ వాయిదా వేసుకున్న నాని?

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చెయ్యటానికి ముహూర్తం అదేనా ?

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చెయ్యటానికి ముహూర్తం అదేనా ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

hyderabad metro rail runs under huge losses

మొరాయిస్తున్న మెట్రో రైళ్లు

హ‌క్కుల ర‌క్ష‌ణ కోస‌మే రైతుల ఉద్య‌మం- కోదండ‌రాం

హ‌క్కుల ర‌క్ష‌ణ కోస‌మే రైతుల ఉద్య‌మం- కోదండ‌రాం

ద్వివేది మెడ‌కు చుట్టుకుంటున్న ఏపీ ఎన్నిక‌ల పంచాయితీ

ద్వివేది మెడ‌కు చుట్టుకుంటున్న ఏపీ ఎన్నిక‌ల పంచాయితీ

రైత‌న్న‌ల‌పై పోలీసుల దాడిని ఖండించిన రేవంత్ రెడ్డి

రైత‌న్న‌ల‌పై పోలీసుల దాడిని ఖండించిన రేవంత్ రెడ్డి

రైతు ఆందోళ‌న‌ల‌పై హోంశాఖ అత్య‌వ‌స‌ర భేటీ

రైతు ఆందోళ‌న‌ల‌పై హోంశాఖ అత్య‌వ‌స‌ర భేటీ

nagam janardhan reddy

ఇది కాంట్రాక్ట‌ర్ల గుప్పిట్లో ఉన్న తెలంగాణ‌

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)