• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » ఏపీలో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా 7వేల కేసులు

ఏపీలో కరోనా ఉగ్రరూపం.. కొత్తగా 7వేల కేసులు

Last Updated: January 18, 2022 at 6:10 pm

ఏపీలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. నమోదవుతున్న రోజువారీ కేసులు అధికారులను సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మెట్రో నగరాలు ఉన్న రాష్ట్రాల్లో సైతం నమోదవ్వనన్ని కేసులు ఏపీ బయటపడుతున్నాయి. ఈ రోజు ఒక్కరోజే 7వేలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గడచిన 24 గంటల్లో 38,055 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 6,996 కరోనా కేసులు నమోదయ్యాయి.

అటు కరోనాతో ముగ్గురు మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 21,14,489 కి చేరింది. కొత్తగా కరోనా నుంచి 1,066 మంది పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకూ 20,63,867 రికవరీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36,108 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా నమోదైన మూడు కరోనా మరణాలో కలిపి మొత్తం 14,514 మంది మృతి చెందారు.

విశాఖ, చిత్తూరు జిల్లాలోనే గత కొన్ని రోజుల నుంచి రికార్డ్ స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఒక్క రోజులో 1,534 కేసులు బయటపడగా.. విశాఖలో 1,263 మంది మహమ్మారి బారిన పడ్డారు. భారీగా కేసులు నమోదవడంతో అధికారులు అప్రమత్తం అవుతున్నారు. మాస్కులు వాడకం, భౌతిక దూరం తప్పని సరి చేశారు.

ఈ రోజు నుండి నైట్ కర్ఫ్యూ అమలు కానుంది. ఈనెల ఆఖరి వరకు రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 వరకుఈ నైట్ కర్ఫ్యూ ను విదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి,ఇండోర్ లో 100 మందికి మాత్రమే అనుమతి కల్పించింది. అయితే అంతరాష్ట్ర రవాణాకు మాత్రం అవకాశం కల్పించింది. సినిమా థియేటర్ల లో సీటు సీటుకు మధ్య గ్యాప్ కూడా ఉండాలని పేర్కొంది.

tolivelugu news - follow on google news
tolivelugu app download


Primary Sidebar

తాజా వార్తలు

కేసీఆర్ మద్యం.. ఆరోగ్యానికి హానికరం!

రాకీబాయ్ లా మారాడు.. ఆస్పత్రిలో చేరాడు!

వేలేరు పీఎస్ నుంచి మల్లన్న విడుదల

వంద నాణెంపై ఎన్టీఆర్ ఫోటో.. ఆర్బీఐతో చ‌ర్చిస్తున్నాం..!

చెప్పేదొక‌టి.. చేసేదొక‌టి..!

చ‌దువు రాని వారికేం తెలుసు.. ప‌రీక్ష‌ల విలువ‌..!

నువ్వా..నేనా ! టఫ్ టైటాన్స్.. రఫ్ రాయల్స్

భార‌త తీరంలో.. విహార నౌక..!

సావర్కర్ బయోపిక్… అదిరిపోయిన ఫస్ట్ లుక్..!

బ్రేకింగ్‌… మల్లన్న అరెస్ట్‌

టీఆర్‌ఎస్‌ లో ముసలం.. మంత్రి పనేనా?

కలెక్టరేట్ ఎదుట కాళేశ్వరం బాధితుల ఆందోళన..చివరకు!

ఫిల్మ్ నగర్

kgf 2 dialogues

రాకీబాయ్ లా మారాడు.. ఆస్పత్రిలో చేరాడు!

సావర్కర్ బయోపిక్... అదిరిపోయిన ఫస్ట్ లుక్..!

సావర్కర్ బయోపిక్… అదిరిపోయిన ఫస్ట్ లుక్..!

అర్జున్ రెడ్డి.. త్వ‌ర‌లో రెండ‌వ భాగం..!

అర్జున్ రెడ్డి.. త్వ‌ర‌లో రెండ‌వ భాగం..!

డ్రెస్ తో తంటాలు.. ఇమేజ్ ఢమాల్..!

డ్రెస్ తో తంటాలు.. ఇమేజ్ ఢమాల్..!

ఒక్క విమర్శ తట్టుకోలేవా రావిపూడి!

ఒక్క విమర్శ తట్టుకోలేవా రావిపూడి!

త్రివిక్రమ్ ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు

త్రివిక్రమ్ ను నన్ను ఎవ్వరూ విడదీయలేరు

కరోనా తర్వాత అతి తక్కువ టికెట్ రేట్లు ఇవే

కరోనా తర్వాత అతి తక్కువ టికెట్ రేట్లు ఇవే

ఎఫ్4 ప్రాక్టికల్ గా వర్కవుట్ అవుతుందా?

ఎఫ్4 ప్రాక్టికల్ గా వర్కవుట్ అవుతుందా?

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)