• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

మరో ఇద్దరు మ్రుతి…వేగంగా విస్తరిస్తోన్న వైరస్

Published on : March 22, 2020 at 11:50 am

కరోనా వైరస్ తో తాజాగా మరో ఇద్దరు చనిపోయారు. చనిపోయిన వారిలో ఒకరు బీహార్, మరొకరు ముంబైకి చెందిన వారు.దీంతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 6 కు చేరింది.కరోనా  పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. శనివారం రాత్రి వరకు మొత్తం బాధితుల సంఖ్య 315 కు చేరిందని అధికారులు  ప్రకటించారు. . 315 మంది బాధితుల్లో 22 మందికి నయం కావడంతో డిశ్యార్జ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 13 వేల మంది చనిపోయారు.

మరో వైపు వైరస్ ను నియంత్రించడం కోసం దేశ ప్రజలంతా ఎవరి ఇళ్ల దగ్గరే వాళ్లే ఉండాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ రోడ్లన్నీ ఎడారులను తలపిస్తున్నాయి.

బాధితుల సంఖ్య పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. రాజస్థాన్ లో మార్చి 31 వరకు పూర్తి షట్ డౌన్ ప్రకటించింది. అన్ని మాల్స్, షాప్స్, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను సస్పెండ్ చేశారు. పేద ప్రజలకు ఆహార పొట్లాలు, గోదుమలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. పంజాబ్ కూడా ప్రజా రవాణాను నిలిపివేసింది. గుజరాత్ లోని అహ్మదాబాద్, సూరత్, రాజ్ కోట్, వదోదర నగరాల్లో బుధవారం వరకు షట్ డౌన్ ప్రకటించారు. నిత్యావసర సరుకులైన కూరగాయలు, పాలు, మెడికల్ షాపుల మాత్రమే తీసి ఉంచాతారు. తిరుమలతో పాటు దేశంలోని ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను మూసి వేశారు. దేశంలో రైళ్ల రాకపోకలను ప్రభుత్వం రద్దు చేసింది. మార్చి 25 వరకు అన్ని రైళ్లను రద్దు చేసినట్టు తెలిసింది.

మహారాష్ట్రలో అత్యధికంగా 63 కేసులు నమోదయ్యాయి. వారిలో ముగ్గురు విదేశీయులున్నారు. ఆ తర్వాత కేరళలో 40 కేసులు నమోదయ్యాయి.

tolivelugu app download

Filed Under: వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

పుష్ప ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామ‌

పుష్ప ఐటెం సాంగ్ లో బాలీవుడ్ భామ‌

బుల్లెట్ పై ప‌వ‌న్- షూటింగ్ వీడియో వైర‌ల్

బుల్లెట్ పై ప‌వ‌న్- షూటింగ్ వీడియో వైర‌ల్

ర‌వితేజ బ‌ర్త్ డే- ఖిలాడీ టీం విషెష్ అదిరిపోయిందిగా..!(వీడియో)

ర‌వితేజ బ‌ర్త్ డే- ఖిలాడీ టీం విషెష్ అదిరిపోయిందిగా..!(వీడియో)

చైతూ కోసం త‌న సినిమా విడుద‌ల‌ వాయిదా వేసుకున్న నాని?

చైతూ కోసం త‌న సినిమా విడుద‌ల‌ వాయిదా వేసుకున్న నాని?

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చెయ్యటానికి ముహూర్తం అదేనా ?

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చెయ్యటానికి ముహూర్తం అదేనా ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

hyderabad metro rail runs under huge losses

మొరాయిస్తున్న మెట్రో రైళ్లు

హ‌క్కుల ర‌క్ష‌ణ కోస‌మే రైతుల ఉద్య‌మం- కోదండ‌రాం

హ‌క్కుల ర‌క్ష‌ణ కోస‌మే రైతుల ఉద్య‌మం- కోదండ‌రాం

ద్వివేది మెడ‌కు చుట్టుకుంటున్న ఏపీ ఎన్నిక‌ల పంచాయితీ

ద్వివేది మెడ‌కు చుట్టుకుంటున్న ఏపీ ఎన్నిక‌ల పంచాయితీ

రైత‌న్న‌ల‌పై పోలీసుల దాడిని ఖండించిన రేవంత్ రెడ్డి

రైత‌న్న‌ల‌పై పోలీసుల దాడిని ఖండించిన రేవంత్ రెడ్డి

రైతు ఆందోళ‌న‌ల‌పై హోంశాఖ అత్య‌వ‌స‌ర భేటీ

రైతు ఆందోళ‌న‌ల‌పై హోంశాఖ అత్య‌వ‌స‌ర భేటీ

nagam janardhan reddy

ఇది కాంట్రాక్ట‌ర్ల గుప్పిట్లో ఉన్న తెలంగాణ‌

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)