హైదరాబాద్పై అసత్య ప్రచారం చేస్తున్నవారికి సీపీ అంజనీ కుమార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలకు ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వస్తున్నారని..నగరంలో ఏదో జరుగబోతోందన్న కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారన్నారని చెప్పారు. కాబట్టి నగర ప్రజలు సోషల్ మీడియాలో జరిగే అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.
ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి ..కానీ నగరం, ప్రజలు శాశ్వతంగా ఉంటారని అంజనీ కుమార్ తెలిపారు.మత ఘర్షణలు, లా అండ్ ఆర్డర్ డిస్ట్రబ్ చేసే వాళ్లపై పీడీ యాక్ట్లు పెడతామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తే.. నగరంలో ఎలాంటి ఘటనలు జరిగినా వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఏదైనా అనుమానం కలిగితే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.