రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు లీటర్ పెట్రోల్ ధర రూ.62 ఉంది. ఇప్పుడు రూ.108కి చేరింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధరలు పెరిగిపోతున్నాయని బీజేపీ నేతలు రోడ్డెక్కారు. మరి.. ఇప్పుడేం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్ కు మోడీ ప్రభుత్వం అమ్ముడుపోయింది. కనీసం వ్యాక్సిన్ ను కూడా సకాలంలో అందించలేకపోయింది. బీజేపీ చేయాల్సింది జన ఆశీర్వాద యాత్ర కాదు.. జన వంచన యాత్ర. విభజన చట్టంలో ఒక్క హామీ కూడా అమలు చేయకుండా.. అన్నీ చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పడానికి సిగ్గుండాలి.
కార్పొరేట్ శక్తులకు మోడీ ప్రభుత్వం కొమ్ముకాస్తోంది. కరోనా సమయంలో అంబానీ, ఆదానీల ఆస్తులు మాత్రమే రెట్టింపు అయ్యాయి. పార్లమెంటులో చర్చ లేకుండా కేంద్రం బిల్లులు పాస్ చేసుకుంటోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఈ విధానంపై ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ఏపీకి చేసినంత అన్యాయం.. దేశంలో ఎక్కడా చేయలేదు. రాష్ట్ర బీజేపీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇప్పటికైనా వాస్తవాలు చెప్పాలి. దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాం. కలిసి వచ్చే పక్షాలతో ఆందోళనలు చేపడతాం. ఏపీ ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయింది.