• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Crime » ఢిల్లీ అగ్ని ప్రమాదం.. 50 మంది ప్రాణాలు కాపాడిన యోధుడు..!

ఢిల్లీ అగ్ని ప్రమాదం.. 50 మంది ప్రాణాలు కాపాడిన యోధుడు..!

Last Updated: May 16, 2022 at 12:15 pm

చుట్టూ మంటలు, దట్టమైన పొగలతో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి. ప్రాణభయంతో ఉరుకులు, పరుగులు తీస్తున్న జనం. దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులు ఘోర అగ్ని ప్రమాదం సంభవించి 27 మంది సజీవ దహనమయ్యారు. అయితే, అగ్నిప్రమాదాన్ని చూసిన కొందరు స్థానికులు ఫైరింజన్లు రావడానికి ముందే సహాయక చర్యలు చేపట్టి పలువురి ప్రాణాలు కాపాడారు. అలాంటి వారిలో క్రేన్ డ్రైవర్ ఒకరు. భవనం మొత్తం మంటలు వ్యాపించడానికి ముందే అతను 50 నుంచి 55 మందిని రక్షించారు.

వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ముంద్కా మెట్రోస్టేషన్ సమీపంలోని ఓ మూడంతస్తుల భవనంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సరిగ్గా ఇదే సమయంలో ముంద్కా ఉద్యోగ్ నగర్ నుంచి దయానంద్ తివారీ అనే క్రేన్ డ్రైవర్ అటుగా వెళ్తున్నాడు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే క్రేన్ యజమాని, ఓ అసిస్టెంట్‌తో సహా వెంటనే అగ్నిప్రమాదం జరిగిన భవనం దగ్గరకు చేరుకుని వారిని రక్షించే కార్యక్రమం మొదలుపెట్టారు.

అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోగా దాదాపు 50 మంది ప్రాణాలు వీరు కాపాడారు. మరింత మందిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మంటలు బిల్డింగ్ మొత్తం వ్యాపించటంతో వీరి వల్ల కాలేదు. అగ్నిమాపక యంత్రాలు ప్రమాదం జరిగిన గంటన్నర తర్వాత ఆలస్యంగా చేరుకున్నాయని.. లేదంటే అంత విషాదం జరిగేది కాదని దయానంద్ తివారీ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇతని సాహసం, మానవత్వంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన ఢిల్లీ పోలీసులు.. మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ టెస్టులు చేస్తున్నారు. అటు ఈ ఘోర విషాదానికి కారణమైన భవన యజమానిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అలాగే, రెండు రోజులుగా పరారీలో ఉన్న యజమాని మనీశ్‌ లక్రాను ఢిల్లీ, హరియాణాలో సోదాలు నిర్వహించి అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.ఈ అగ్ని ప్రమాదంలో 21 మంది మహిళలు సహా మొత్తం 27 మంది సజీవదహనం కాగా.. మరో 19 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

Primary Sidebar

తాజా వార్తలు

మంధానను వెంటాడుతున్న అసంతృప్తి!

కోతి కోసం రోడ్డుపై భారీ ఆందోళన!

ఆ రేపిస్టులను వదలొద్దు.. యూపీలో టీనేజర్ సూసైడ్

ఇండియాలో మానవ హక్కుల ఉల్లంఘనలు.. అమెరికా ‘ఆక్రోశం’

భూకంప విలయం.. పాకిస్తాన్ లో 11 మంది మృతి

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాము విషాన్ని నోటితో తీసి తల్లిని కాపాడుకున్న కూతురు…!

ఫిల్మ్ నగర్

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

భగత్ సింగ్ లోనా..నేనా..! వట్టిరూమర్స్ బాస్..!!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

యోగా ప్రాక్టీస్ తో అల్లుఅర్జున్ కి షాకిచ్చిన అర్హ..!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ....!

ఉగాది సందర్భంగా భోళాశంకర్ కంటెట్ పోష్టర్ ….!

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ ...ఎందుకబ్బా...!?

సామ్ యాజ్ బ్యూటీ ఇన్ బ్లాక్ …ఎందుకబ్బా…!?

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై....నటి హేమ కంప్లైంట్ ..!

అసత్య ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్ళపై….నటి హేమ కంప్లైంట్ ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్...చేజార్చుకున్న కోహ్లీ..!

‘పాపులర్ సెలెబ్రిటీస్’లిస్ట్ లో టాప్ కి చరణ్…చేజార్చుకున్న కోహ్లీ..!

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్....!?

పాయల రాజ్ పుత్ కు హెల్త్ ప్రాబ్లమ్….!?

తగ్గని‘నాటు నాటు’ఫీవర్...ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం ...!

తగ్గని‘నాటు నాటు’ఫీవర్…ఎడిసన్ సిటీలో దక్కిన మరో గౌరవం …!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap