హీరో దగ్గుబాటి రానాపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. అలాగే సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబుపైన కూడా కేసు నమోదయింది. ఫిలింనగర్ భూ వివాదంలో దౌర్జన్యంగా తమను ఖాళీ చేయించారంటూ ప్రమోద్ కుమార్ అనే వ్యాపారి ఫిర్యాదు చేయడంతో బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
దౌర్జన్యంగా తమను రౌడీల సాయంతో ఖాళీ చేయించారు అని ఫిర్యాదు దారుడు పోలీసులకు తెలిపారు. ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరించారని అతడు తన ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదు చేసినా బంజారా హిల్స్ పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు బాధితుడు.
సురేష్ బాబు, దగ్గుబాటి రానాతో సహా మరి కొంతమంది విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది కోర్టు.ఈ వ్యవహారం పై గతంలోనూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. తాజాగా కోర్టు జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు ఇదే వార్త ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ విషయం పై ఎలా స్పందిస్తారో చూడాలి.