ఉత్కంఠ పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ ను ఓడించింది చెన్నై సూపర్ కింగ్స్. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి కేకేఆర్ కు షాకిచ్చింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది కోల్ కతా. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. రాహుల్ త్రిపాఠి 45, నితీష్ రానా 30 పరుగులతో రాణించారు.
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై తొలుత నెమ్మదిగా ఆడి తర్వాత స్పీడ్ పెంచింది. లాస్ట్ ఓవర్ కు 4 పరుగులు కావాల్సి ఉండగా… మొదటి బంతికి వికెట్ కోల్పోయింది సీఎస్కే. రెండో బాల్ పరుగులేమీ రాలేదు. మూడో బంతికి మూడు రన్స్ చేయడంతో సీఎస్కే అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే నాలుగోది డాట్, ఐదోది వికెట్ కోల్పోవడంతో మ్యాచ్ డ్రాగా ముగుస్తుందేమోనని అనుకున్నారు. కానీ.. చివరి బంతికి రన్ చేసి విజయం సాధించింది చెన్నై.
WHAT. A. MATCH! 👌 👌
Absolute scenes in Abu Dhabi as @ChennaiIPL win the last-ball thriller against the spirited @KKRiders. 👏 👏#VIVOIPL #CSKvKKR
Scorecard 👉 https://t.co/l5Nq3WwQt1 pic.twitter.com/Q53ym5uxtI
— IndianPremierLeague (@IPL) September 26, 2021
Advertisements
సీఎస్కీ టీమ్ లో డుప్లెసిస్ 43, రుతురాజ్ గైక్వాడ్ 40 పరుగులతో అదరగొట్టారు. చివరిలో జడేజా మెరుపులు మెరిపించాడు. 8 బంతుల్లో 22 రన్స్ చేశాడు.