రోజురోజుకి ఆన్ లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. సైబర్ పోలీసులు ప్రజలను ఎంత అప్రమత్తం చేస్తున్నప్పటికీ.. మోసపోయే వారు మోసపోతూనే ఉంటున్నారు. అలాంటిదే తాజాగా ఇంకొక మోసం వెలుగు చూసింది. కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో మోసాలకు పాల్పడుతున్న రాకేష్ కుమార్ అనే నిందితుడ్ని సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘కౌన్ బనేగా కరోడ్పతి’ లాటిరీ పేరుతో మహిళను నిలువునా ముంచాడు రాకేష్ కుమార్ అనే సైబర్ మోసగాడు. 25 లక్షల రూపాయల లాటరీ గెలుచుకున్నారని చెప్పి ఆ మహిళ నుంచి 39 లక్షలు కాజేసి పంగానామం పెట్టాడు.
గతేడాది అక్టోబర్లో ఖైరతాబాద్కు చెందిన ఓ మహిళకు 25లక్షలు లాటరీ గెలుచుకున్నారని ఫోన్కు మెసెజ్ వచ్చింది. స్పందించిన మహిళ మెసెజ్లో ఉన్న నంబరుకు ఫోన్ చేసింది. గెలుచుకున్న నగదు విత్ డ్రా చేయాలంటే కొన్ని ఫీజులు కట్టాలని తెలుపగా.. విడతల వారీగా నగదును రాకేశ్ తెలిపిన ఖాతాకు బదీలి చేశారు.అంతటితో ఆగకుండా చివరకు బ్యాంకు అధికారిలా ఫోన్ చేశారు. ‘మీ ఖాతాలో డబ్బు జమ కావల్సి ఉందని.. కొన్ని ఛార్జీలు కట్టాలని బురిడి కొట్టించి మొత్తం రూ.39లక్షలు కాజేశాడు.
ఎప్పటికీ నగదు రాకపోవడంతో మోసపోయామని గ్రహించినబాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు రాకేశ్ కుమార్ను బీహార్లో అరెస్ట్ చేసిన పోలీసులు… అతని నుంచి 16 చరవాణులు, 73 డెబిట్ కార్డులు, 30 సిమ్ కార్డులు, 11బ్యాంకు పాస్బుక్లు, 2 చెక్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. బీహార్కు చెందిన రాకేశ్… తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా నేరాలకు పాల్పడి కోట్లలో డబ్బు కాజేశాడని గుర్తించారు. ఇప్పటివరకు కౌన్ బనేగా కరోడ్పతి పేరుతో రూ.3 కోట్ల మేర మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.