• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » చెన్నైలో మాండౌస్ బీభత్సం…పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్….!

చెన్నైలో మాండౌస్ బీభత్సం…పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్….!

Last Updated: December 10, 2022 at 2:03 pm

మాండౌస్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. బంగాళఖాతంలో ఏర్పడిన ఈ తుఫాన్ బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మాండూస్ తుఫాన్ తీరం దాటినట్టు ఐఎండీ పేర్కొంది.

ఆ సమయంలో రాష్ట్ర రాజధాని చెన్నైతో పాటు చెంగల్‌పట్టు, విల్లుపురం, కాంచీపురం, కరైకల్‌, పుదుచ్చేరి సహా పలు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచాయి. బలమైన గాలులకు పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. విద్యుత్ స్తంబాలు నెలకొరగడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. ఈ తుఫాన్ శనివారం మధ్యాహ్నం వరకు మరింత బలహీన పడి వాయుగుండగా మారుతుందని వెల్లడించింది.

తుఫాన్ నేపథ్యంలో చెన్నై, చెంగల్‌పట్టు, కరైకల్‌, మహాబలిపురం, పుదుచ్చేరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. రాజధాని చెన్నైలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ జలాశయాలను తలపించాయి. ఈ క్రమంలో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భారీ వర్షాలకు చెన్నై టీ-నగర్‌లో గోడ కూలిన ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. తుఫాన్ నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.

ముందస్తు చర్యల కింద తీర ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. సహాయ చర్యలు అందించేందుకు రెడీగా ఉండాలని ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి సూచించింది. పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారలు సూచించారు.

Primary Sidebar

తాజా వార్తలు

ఇద్దరు అబ్బాయిలు పెళ్ళి చేసుకుంటామని కోర్టుకెక్కారు..!

సుప్రీంకు కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు

హైదరాబాద్ కి ముంచుకొస్తున్న హై టెంపరేచర్…!

తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక డైరీ ఆవిష్కరణ

బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే.. కేసీఆర్‭ కు చివరి ఎన్నికలు ఇవే..!

కేటీఆర్ అబద్దాలను కూడా వినసొంపుగా చెప్పారు!

ఎన్టీఆర్ వచ్చినా లాభం లేదు.. లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు

కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు!

ఉద్యమకారులను తమ అవసరాల కోసం వాడుకుంటున్నారు

గట్టు బాగు చేయడానికి పెట్టిన నిప్పు… ముప్పుతెచ్చింది.!

ఇంటి స్థలాల కోసం జర్నలిస్టులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి..!

తుంగతుర్తిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా!

ఫిల్మ్ నగర్

వాణీ జయరాం మృతిపై ప్రముఖుల సంతాపం

వాణీ జయరాం మృతిపై ప్రముఖుల సంతాపం

వాణీ జయరాంకు తెలుగువారితో జన్మజన్మల బంధం

వాణీ జయరాంకు తెలుగువారితో జన్మజన్మల బంధం

వాణీ జయరాం మృతి.. అనుమానాస్పదం..!

వాణీ జయరాం మృతి.. అనుమానాస్పదం..!

జపాన్ లో ఆర్‌ఆర్‌ఆర్‌ 105 వ రోజు కలెక్షన్లు!

జపాన్ లో ఆర్‌ఆర్‌ఆర్‌ 105 వ రోజు కలెక్షన్లు!

సరిగ్గా చేయలేక ఏడుస్తూ బయటకు వచ్చేశా!

సరిగ్గా చేయలేక ఏడుస్తూ బయటకు వచ్చేశా!

అమిగోస్ ట్రైలర్‌ రివ్యూ!

అమిగోస్ ట్రైలర్‌ రివ్యూ!

హరిహర వీర మల్లు నుంచి కొత్త స్టిల్స్‌!

హరిహర వీర మల్లు నుంచి కొత్త స్టిల్స్‌!

ట్రైలర్‌ రేంజ్ లో విజయ్ వీడియో!

ట్రైలర్‌ రేంజ్ లో విజయ్ వీడియో!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap