దాసోజు శ్రవణ్.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి
సీఎం కేసీఆర్ కేంద్ర రాజకీయల్లో స్థానం సంపాదించుకోవలనే స్వార్ధం కోసం ఢిల్లీ వెళ్లారు. పంజాబ్ రైతులను పరామర్శించడానికి సీఎం కేసీఆర్ పంజాబ్ వెళ్లారు. మన రక్త మాంసాలతో ఏర్పడ్డ ప్రభుత్వ ఖజానాను పంజాబ్ రైతులకు సహాయం కోసం ఇస్తానని వెళ్ళాడు. మరి తెలంగాణ రైతులను ఎవరు ఆదుకోవాలి.
మన రాష్ట్ర రైతులను పంజాబ్ ముఖ్యమంత్రి ఆదుకుంటారా..? ఢిల్లీలో పంజాబ్ రైతులు నిరసన తెలిపినప్పుడు ఒక్క రోజు కూడా అక్కడికి వెళ్లి సంఘీభావం తెలపలేదు ఎందుకు. 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే 194 జీవో ప్రకారం కేవలం వెయ్యి మందికి మాత్రమే 6 లక్షల ఆర్థిక సహాయం చేశారు. మిగతా 7 వేల మంది రైతుల కుటుంబాల్లో మన్ను కొట్టారు. పంజబ్ రైతులకు సహాయం కేవలం కేసీఆర్ ఆడుతున్న డ్రామా తప్ప దేశవ్యాప్త రైతులను ఆదుకోవాలని కాదు.
గజ్వేల్ లో సెల్ఫీ వీడియో తీసుకొని రైతు ఆత్మహత్య చేసుకున్నారు. దానికి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు. టీఆరెస్ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలి. వడ్ల కొనుగోలు ప్రారంభమై 45 రోజులు అయింది. ఇంకా 40 శాతం కూడా కొనుగోలు చేయలేదు. రైతు భీమా ద్వారా రైతులు ఎవరు చనిపోయిన 5 లక్షలు ఇస్తాం అన్నారు.. అది ఏమైంది..? ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చారో చెప్పాలి. ఆ లిస్ట్ ను ప్రజలందరికీ తెలిసేలా బయటపెట్టాలి.
రుణమాఫీ ఏమైంది..? 23 వేల కోట్లకు కేవలం వెయ్యి కోట్లు కేటాయించారు. పంట భీమా లేదు. 2020 వరదల వల్ల వచ్చిన పంట నష్టపరిహారం ఇవ్వలేదు. రైతులను ఓట్ల బిచ్చగాళ్లుగా చూస్తున్నారు. నెల రోజులు పాటు రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్తాము. రాష్ట్ర ప్రభుత్వానికి ఇదే మా హెచ్చరిక.