యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది చిత్ర యూనిట్. రెండు నెలల తరువాత ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేసేందుకు డేట్ ఖరారు చేరారు మేకర్స్. అందుకు సంబంధించిన డేట్ ను అధికారికంగా ప్రకటించారు.
మార్చి 25 న రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టించిన ఈ సినిమా.. ఇప్పటివరకు ఏ సినిమా అందుకొని రికార్డ్ ను కైవసం చేసుకొంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్ల కలెక్షన్స్ రాబట్టి టాలీవుడ్ సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది.
భారీ ధరపెట్టి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఇప్పటికే సొంతం చేసుకుంది. కాగా.. ఈ సినిమాను మే 20 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది.
తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ కానుండగా.. హిందీ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. మరి థియేటర్ లోనే రికార్డులు సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలంటున్నారు అభిమానులు.