యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆలయంలో అడవి పంది కలకలం సృష్టించింది. శనివారం ఉదయం క్యూకాంప్లెక్స్ లో కాసేపు అటూ ఇటూ పరిగెత్తింది. ఈ క్రమంలో అక్కడి భక్తుల అరుపులకు భయపడిన పంది.. తప్పించుకునే ప్రయత్నం చేసింది.
అయితే, పందిని పట్టుకునేందుకు ఎస్పీఎఫ్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించారు. అయినప్పటికి వారికి చిక్కకుండా తప్పించుకునే క్రమంలో భవనంపై నుంచి పడి చనిపోయింది. పంది కళేబరాన్ని సిబ్బంది తొలగించింది.
అడవి పంది ఆలయ మాడవీధుల్లోకి రావడం భక్తులు అపశృతిగా భావించారు. స్వామివారి ఆలయ మాడవీధుల్లో పంది చనిపోవడం దేనికి సంకేతం అని కొందరు భక్తులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే అడవి పంది తిరిగి ప్రాంతమంతా లఘు పుణ్యవచనం చేస్తే సరిరపోతుందని అర్చకులు తెలిపారు. దీనికోసం దర్శనాలు నిలిపివేయాల్సి అవసరం లేదని అధికారులు తెలిపారు.