దేశంలో కోవిడ్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,07,474 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, శనివారంతో పోలిస్తే 16 శాతం పాజిటివ్ కేసులు తగ్గాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 7.42 శాతానికి పడిపోయింది. మరణాల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గి 865 మంది మరణించినట్టు తెలిపారు.వైరస్ నుంచి 2,13,246 మంది కోలుకున్నారు.మొత్తం 12,25,011 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరణాల సంఖ్య 5,01,979 కు చేరుకుంది.
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవతంగా జరుగుతోంది. కొత్తగా 45,10,770 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,69,46,26,697 డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. డిసెంబర్ నుంచి ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా వేగంగా కేసులు పెరిగాయను వెల్లడించింది.
ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 22 లక్షల మందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. కరోనా కారణంగా ఎనిమిది వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేశారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రెజిల్, రష్యా, జర్మనీల్లో కరోనా కేసుల పరంపర కొనసాగుతూనే ఉందని పేర్కొన్నారు. యూఎస్ లో కొత్తగా 2.05 లక్షల మందికి పాజిటివ్ గా నిర్ధారణ కాగా.. 1,051 మంది మరణించినట్టు తెలిపారు.
ఫ్రాన్స్ లో ఒక్కరోజే 2.14 లక్షలకు పైగా కోవిడ్ కేసులు బయటపడ్డాయి. బ్రెజిల్ లో కొత్తగా 1.54 లక్షల మందికి వైరస్ సోకగా.. 800 మంది చనిపోయారు. రష్యాలో తాజాగా 1.77 లక్షలకు పైగా కరోనా కేసులు బయటపడ్డాయి. జర్మనీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని దేశాల్లో కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.