బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్, దీపికా పడుకోణె జంటగా నటించిన పఠాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ చిత్రం రిలీజ్ అయిన తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో యష్ రాజ్ ఫిలింస్, చిత్ర యూనిట్ ముంబైలో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో షారుఖ్ ఖాన్, దీపికా పడుకోణె, జాన్ అబ్రహంతోపాటు చిత్రంలో నటించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా దీపికా భావోద్వేగానికి గురైంది. నాపై మీ అందరి ప్రేమ, ప్రశంసలు చూసి చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది. సినిమా విడుదలైన రోజు థియేటర్కు వెళ్లి అభిమానుల రెస్పాన్స్ చూడాలనుకున్నానని ఆ రోజు వీలు కాలేదు.
ఇప్పుడు మీరు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే ఒక పండగలా అనిపిస్తుందని చెప్పింది. నిజాయితీగా చిత్తశుద్దితో పనిచేస్తే కచ్చితంగా బహుమతి ఇస్తుందని పఠాన్ రుజువు చేసిందంటూ దీపిక సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలిరోజు నుంచి ఇప్పటి వరకు రూ.500 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ఇప్పటికే బాలీవుడ్ లో `కేజీఎఫ్2` ‘బాహుబలి’ కలెక్షన్ల రికార్డులను బ్రేక్ చేసి హిందీ సినిమా చరిత్రలోనే హయ్యెస్ట్ వీకెండ్ గ్రాస్ ఓపెనర్ గా నిలిచింది.