Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)
ఈనెల 28 వరకు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోంది. భారతీయ సినీ సెలెబ్రెటీలు ఇందులో పాల్గొని తిరిగి వచ్చేశారు. అయితే.. జ్యురీ మెంబర్ కావడంతో దీపికా పదుకొనే మాత్రం అక్కడే ఉంది. ప్రమోషన్ షూట్లతోపాటు రెడ్ కార్పెట్ పై తళుక్కున మెరుస్తోంది.
ఇప్పటికే గార్జియస్ లుక్స్ తో అందరి హృదయాలను గెలుచుకున్న దీపిక.. తాజాగా బ్లాక్ ఫీథర్ గౌన్ లో మెరిసింది. రెడ్ కార్పెట్ పై నవ్వులు చిందిస్తూ నడిచింది. దీనికితోడు మేకప్ తన అందాన్ని మరింత రెట్టింపు చేసింది. ఈ వాక్ లో తన చెవి పోగులు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.ఇక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా అక్కడి మీడియాతో ముచ్చటించింది దీపిక. ‘‘అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో భారతీయ సినిమాలకు ఇప్పుడున్నంత ప్రాధాన్యత ఒకప్పుడు ఉండేది కాదు. దేశీయ చిత్ర పరిశ్రమ ఒక్కటిగా సాధించిన విజయం ఇది. ప్రతిష్టాత్మక ఈ కేన్స్ చిత్రోత్సవాల్లో భారతదేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు దీనికి ఆహ్వానం అందుకున్న సినీ తారలు తక్కువే. కానీ.. ఇవాళ భారతీయ సినిమా పతాకం ఎగురుతోంది. మనమంతా ఐక్యంగా సాధించిన విజయమిది. మన సినిమా ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాలి” అని చెప్పుకొచ్చింది.బాలీవుడ్ ఇండస్ట్రీలో దీపిక తిరుగులేని హీరోయిన్ గా దూసుకుపోతోంది. చిన్న హీరోలతోనూ నటిస్తూ ఇతర స్టార్స్ కు స్ఫూర్తిగా నిలుస్తోంది. చివరిగా గెహ్రైయాన్ చిత్రంతో ఆకట్టుకున్న దీపిక… ప్రస్తుతం షారుక్ తో పఠాన్ మూవీలో, ప్రభాస్ ప్రాజెక్ట్ కేలో నటిస్తోంది. అలాగే అమితాబ్ బచ్చన్ తో ఇంటర్న్, హృతిక్ రోషన్ తో ఫైటర్ సినిమాలు చేస్తోంది.