మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వతాపూర్ సమీపంలోని జటాయువువ ఫారెస్ట్ పార్కులో దారుణం చోటు చేసుకుంది. వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ జింకపిల్ల ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు దర్యాప్తును ప్రారంభించారు.
కాగా వీధి కుక్కలు జటాయువు ఫారెస్ట్ లోకి ఎలా ప్రవేశించాయన్న కోణంలో అటవీ శాఖ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పార్కుకు సమీపంలోని సాయిప్రియా కాలనీలో ప్రహరీ నిర్మాణ మరమ్మతులు చేపట్టకపోవడం వల్లనే ఘటన చోటుచేసుకుందని స్థానికులు భావిస్తున్నారు.
కుందేళ్ళ వేటగాళ్ళు ఆ మార్గం ద్వారా జటాయువు లోకి గుట్టు చప్పుడు కాకుండా ప్రవేశించి అందినకాడికి దోచుకుంటున్నారు. గతంలో కూడ వేటగాళ్ళు అక్కడ వేసిన వలలను వాకర్స్ తొలగించి ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుక వెళ్లడం జరిగింది… తాజాగా జింక పిల్ల ను వీధి కుక్కలు దాడి చేసి చంపడం పట్ల వాకర్స్, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అటూ ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం, మరోవైపు వీధి కుక్కలను నివారించడంలో విఫలం కావడం పై అధికార యత్రాంగంపై పలువురు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జింక మృతికి కారణమయిన ఫారెస్ట్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.