తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆర్ధిక మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్ మరోమారు నిరాహార దీక్షకు దిగాడు. తనతోపాటు జైలులో శిక్ష అనుభవిస్తున్న భార్యను ప్రతివారం కలిసేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశాడు. గత కొద్ది రోజులుగా తినడం మానేసిన సుఖేష్.. గత గత నెల 23 నుండి దీక్ష ప్రారంభించాడు. దీంతో అతని గ్లూకోజ్ బాటిల్స్ ఇస్తూ చికిత్స అందిస్తున్నారు అధికారులు.
అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్న సుఖేష్.. గత నెల ఏప్రిల్ 23 నుంచి మే 2వ తేదీ వరకు.. మళ్లీ ఇప్పుడు మే 4 నుంచి 12 వరకు కూడా ఆహారం తీసుకోలేదని అధికారులు చెప్తున్నారు. ఆ తర్వాత మే 12 నుండి 22 వరకు లిక్విడ్ డైట్ తీసుకున్న సుఖేష్.. 23నుండి ఎలాంటి ఫుడ్ తీసుకోవడం లేదని వెల్లడించారు. దీంతో జైలు ఆసుపత్రిలోనే అతనికి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
ఈ నేపథ్యంలో సుఖేష్ అభ్యర్థన మేరకు ప్రతి నెలలో మొదటి, మూడో శనివారం భార్య లీనాను కలిసేందుకు అనుమతివ్వనున్నట్టు అధికారులు తెలిపారు. అయితే.. ఎక్కువ సార్లు కలిసేందుకు అనుమతులు కావాలని డిమాండ్ చేస్తున్నాడు ముఖేష్.
రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల నుంచి రూ. 200 కోట్లు వసూలు చేశారు. వాళ్లను నమ్మించి భారి మొత్తంలో ఆర్ధిక మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో గత నాలుగు నెలలుగా సుఖేష్ పాటు..అతడి భార్య లీనా మరియా పాల్ కూడా తిహార్ జైలులో శిక్ష అనుభవిస్తోంది.