ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన్ని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు కాల్స్ చేసినట్టు ఆయన వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు.
సోమవారం అర్ధరాత్రి 12 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు పీసీఆర్ కాల్ చేసినట్లు వారు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
కేజ్రీవాల్ కు బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. వెంటనే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తిని జయప్రకాశ్ గా పోలీసులు గుర్తించారు.
కాల్ చేసిన వ్యక్తి మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతను ఢిల్లీలోని గులాబీ బాగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు వెల్లడించారు. దీంతో అతన్ని అరెస్టు చేయలేకపోయామని పోలీసులు తెలిపారు.