కరోనా కేసుల విషయంలో ఢిల్లీ, హర్యానా ఆరోగ్య శాఖ మంత్రుల మధ్య వార్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. కాగా తాజాగా హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ మాట్లాడుతూ రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయని….ముఖ్యంగా ఢిల్లీని ఆనుకొని ఉన్న మూడు రాష్ట్రాల్లో కేసుల ఎక్కువగా వస్తున్నాయన్నారు.
ఢిల్లీ సర్కారు కేసులను నియంత్రించడంలో విఫలం అవుతుందని అన్నారు. ఆ ప్రభావం హర్యానపై పడుతుందని ఆరోపించారు.
అయితే అనిల్ విజ్ వ్యాఖ్యలపై ఢిల్లీ హెల్త్ మినిస్టర్ సత్యేందర్ జైన్ తనదైన శైలి లో స్పందించారు. అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఉద్దేశించినవి అని అన్నారు. ఢిల్లీలో ఎంతమంది హర్యానా ప్రజలు కరోనా బారిన పడుతున్నారో తాను లెక్కలతో సహా చెప్పగలనన్నారు. దేశ రాజధానిలో నిత్యం నమోదైన కేసుల్లో 1000 కేసులు బయట నుంచి వచ్చిన వారివే అన్నారు జైన్.
These are political talks, I can also tell how many Haryana people are testing positive in Delhi. Over 1,000 #COVID19 cases are being reported from outside Delhi every day: Delhi Health Minister Satyendar Jain https://t.co/6JlKChioq9 pic.twitter.com/sVIb0gJXnM
— ANI (@ANI) January 17, 2022