• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Tolivelugu తొలివెలుగు – Latest Telugu Breaking News

Tolivelugu తొలివెలుగు - Latest Telugu Breaking News

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Viral » అవీ ఇవీ... » సీజనల్ వ్యాధులతో తస్మాత్..!

సీజనల్ వ్యాధులతో తస్మాత్..!

Last Updated: July 12, 2022 at 3:14 pm

వర్షకాలం వచ్చిదంటే చాలు సీజనల్‌ వ్యాధులు ప్రబలుతూనే ఉంటాయి. అయితే.. ఓ వైపు కరోనా కేసులు ఎక్కువవుతుండగా, వాతవరణ మార్పులతో డెంగీ.. మలేరియా, వైరల్ ఫీవర్లతో ఆసుపత్రుల బాట పడుతున్నారు ప్రజలు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. నీళ్లు నిలిచిపోవడం, డ్రైనేజీలు, చెత్తచెదారం, ఇతర వ్యర్థాలు నీళ్లలో కలవడం, దోమలు, కంపు, కలుషిత వాతావరణంతో వేల మంది విష జ్వరాల బారినపడ్తున్నారు.

రాష్ట్రంలో ఎడతెరిపిలేని వానలు కురుస్తుండటంతో సీజనల్ వ్యాధులు అధికంగా ప్రబలే అవకాశముందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటికే విషజ్వరాలు వేగంగా ప్రబలుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డెంగీ కేసులు అధికంగా వచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు మొత్తం 1184ల డెంగీ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. తెలంగాణలో టైఫాయిడ్ కేసులు కూడా అధికంగా నమోదవుతున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు అనేక రకాల వ్యాధులు ముంచుకొస్తుండటంతో.. మలేరియా నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని డీహెచ్ తెలిపారు. సీజనల్ వ్యాధుల కట్టడికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక సూచనలు చేసినట్లు చెప్పారు. నీళ్ల విరేచనాలకు సంబంధించి రాష్ట్రంలో 6వేల కేసులు నమోదైనట్లు డీహెచ్ వెల్లడించారు. కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల నీళ్ల విరేచనాలు కలుగుతాయని వివరించారు.

సీజన్ వ్యాధుల నేపథ్యంలో వ్యాధుల కట్టడి, సత్వర చికిత్స కోసం గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ వరకూ ‘డిసీజ్ కంట్రోల్​కమిటీ’లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఆరోగ్యశాఖ. రోగాలు ప్రబలుతున్న ప్రాంతాల్లో అధికారులు పర్యటించి, ఫీవర్​ సర్వేలు నిర్వహించనున్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

బండి పాదయాత్రలో దాడిపై కిషన్ రెడ్డి సీరియస్

బీజేపీ సర్పంచ్ కు సీరియస్!

పాల ధర పెంచిన అమూల్ … లీటర్ పై ఎంతంటే…!

యూఎస్ లో ఆర్ఎస్పీ.. ఎన్నారైలతో!

హంబన్ టోటాలో చైనా నౌక.. ఆందోళనలో భారత్…!

ఆర్థిక స్వావ‌లంబ‌న సాధించాలి!!

పాక్ లో ల్యాండ్ అయిన హైద‌రాబాద్ విమానం!!

పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం

ప్రాజెక్టుల్లోకి భారీగా వ‌ర‌ద నీరు!!

మోడీపై కేటీఆర్ సెటైర్స్‌..నెటిజన్స్ నుంచి సారుకు కౌంటర్స్

‘మునుగోడు’ ఆలస్యం… బీజేపీకి కలిసొస్తుందా…!

మారని బతుకులు.. కష్టాల పోగులో నేతన్న

ఫిల్మ్ నగర్

కార్తికేయ దెబ్బ‌కి బోర్లా ప‌డిన బాలీవుడ్!!

కార్తికేయ దెబ్బ‌కి బోర్లా ప‌డిన బాలీవుడ్!!

శింగ‌న‌మ‌ల‌లో స‌లార్ డైరెక్ట‌ర్‌!!

శింగ‌న‌మ‌ల‌లో స‌లార్ డైరెక్ట‌ర్‌!!

ఇది కదా డీల్ అంటే.. ఉన్నఫలంగా రూ. 70 కోట్లు

ఇది కదా డీల్ అంటే.. ఉన్నఫలంగా రూ. 70 కోట్లు

బింబిసార మాస్.. తొలిసారి రూ.50 కోట్ల క్లబ్ లోకి..!

బింబిసార మాస్.. తొలిసారి రూ.50 కోట్ల క్లబ్ లోకి..!

నితిన్ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ ఇంతే..!

నితిన్ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ ఇంతే..!

కార్తికేయ 2.. మరో కశ్మీర్ ఫైల్స్ అవుతుందా?

కార్తికేయ 2.. మరో కశ్మీర్ ఫైల్స్ అవుతుందా?

ఆది సాయికుమార్ నుంచి మరో విశ్వప్రయత్నం

ఆది సాయికుమార్ నుంచి మరో విశ్వప్రయత్నం

సలార్ షాకింగ్ అప్డేట్ వచ్చేసిందోచ్

సలార్ షాకింగ్ అప్డేట్ వచ్చేసిందోచ్

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2022 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)