తెలంగాణ సర్కార్ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అదనంగా ఏడు మార్కులు కలిపిన విషయం విదితమే. దీంతో క్వాలిఫై అయిన వారికి బుధవారం నుంచి ఈవెంట్లు ప్రారంభమయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో తమకు ఈవెంట్స్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ గురువారం గర్భిణీ ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ధర్నా చేపట్టారు.
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రభుత్వం ఏడు మార్కులు కలపడంతో అర్హులైన వారికి గురువారం కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఫిజికల్ టెస్ట్ లు నిర్వహించనున్నారు. వీరిలో కొందరు గర్భవతులు కూడా ఉన్నారు.
దీంతో తమను ఫిజికల్ టెస్టుల నుంచి మినహాయింపు కోరుతూ సుమారు 40 మంది అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ట్రైనింగ్ సెంటర్ దగ్గర, రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ ఆర్డర్స్ ఏడు మార్కులు కలిపిన వారికి వర్తించవని అధికారులు చెబుతుండటంతో గర్భిణీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాగా గర్భంతో ఉన్నవారికి నేరుగా మెయిన్స్ రాసుకునేందుకు అవకాశం ఇచ్చేలా జనవరిలో టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించింది. మెయిన్స్ అనంతరం వారికి ఈవెంట్స్ నిర్వహిస్తామని వెల్లడించింది.