బాలీవుడ్ బాద్షా షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ పబ్లిక్ లో చాలా అరుదుగా కనిపిస్తుంటాడు. తాజాగా ఆయన ఓ బాలీవుడ్ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ కు హాజరయ్యారు. ఆయన బీటౌన్ నటీనటులతో కలిసి మూవీని ఎంజాయ్ చేశారు. అయితే అదే సమయంలో అక్కడ ఉన్న ఓ హీరోయిన్ ను ఆర్యన్ ఏమాత్రం పట్టించుకోకుండా పక్క నుంచి వెళ్లిపోయారు.
ఇప్పుడు ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అసలు ఆర్యన్ పట్టించుకోకుండా వెళ్లిపోయిన కథానాయిక ఎవరంటే… లైగర్ బ్యూటీ అనన్య పాండే. నటి మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త చిత్రం ‘మజా మా’.
అమెజాన్ ప్రైమ్ వేదికగా అక్టోబర్ 6 నుంచి ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీటౌన్ సెలబ్రిటీల కోసం ముంబయిలోని ఓ మాల్లో ‘మజా మా’ స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ కార్యక్రమానికి నటి అనన్య పాండే, ఆర్యన్ఖాన్, కరణ్ జోహార్, మనీశ్ మల్హోత్ర హాజరయ్యారు.
స్క్రీనింగ్కు వెళ్లే ముందు థియేటర్ బయట అనన్యను చూసిన ఆర్యన్.. ఆమెను ఏ మాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. దీనిని చూసిన కొంతమంది నెటిజన్లు.. “అయ్యో పాపం అనన్య ఫీలై ఉంటుంది” అంటూ సరదా కామెంట్స్ పెడుతున్నారు.
మరోవైపు, షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్కు అనన్య మంచి స్నేహితురాలు. షారుఖ్ నివాసంలో జరిగే ప్రతి కార్యక్రమానికి అనన్య హాజరవుతుంటారు. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ షోలోనూ అనన్య ఈ విషయాన్ని బయటపెట్టారు. అలాగే, తనకు ఆర్యన్ అంటే ఇష్టమనీ చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా వచ్చిన వీడియో చూసి పలువురు నెటిజన్లు.. ఆర్యన్ కావాలనే ఆమెను పట్టించుకోకుండా వెళ్లిపోయారనుకుంటున్నారు.