2022 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు వేలం నిర్వహించాయి. అయితే.. ఈ ఐపీఎల్ వేలంలో అపశృతి చోటు చేసుకుంది. ఆటగాళ్ల వేలాన్ని నిర్వహిస్తున్న ప్రముఖ ఆక్షనీర్ హ్యూ ఎడ్మీయడస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఓ ఆటగాడి రేటు వివరాలు ప్రకటిస్తూ ఉన్నట్టుండి ముందుకు పడిపోయారు.
దాంతో ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న వివిధ ఫ్రాంచైజీలకు చెందిన వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో టీవీ చానళ్లలో లైవ్ ప్రసారం కూడా ఆపేశారు. ఎడ్మీయడస్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
హ్యూ ఎడ్మీయడస్ బ్రిటన్ జాతీయుడు. 2018 నుంచి ఐపీఎల్ వేలం అతనే నిర్వహిస్తున్నారు. గతంలో రిచర్డ్ మ్యాడ్లీ ఐపీఎల్ వేలం నిర్వహించేవారు. కాగా.. మ్యాడ్లీ బ్రిటన్ లో అంపైర్ గా నియమితుడు అయ్యాడు.
అతడి స్థానంలో ఎడ్మీయడస్ వేలం నిర్వహణ చేపట్టారు. గత కొన్ని సీజన్లుగా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాఫీగా వేలం నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు. ఉన్నట్టుండి ఒక్క సారీగా అతను పడిపోవడంతో ఆటగాళ్లతో పాటు.. ఫ్రాంచైజీలు, బీసీసీఐ సభ్యలు దిగ్భ్రాంతికి లోనయ్యారు.