తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కు కనీసం చిత్తశుద్ధి లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు.శుక్రవారం పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ, భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యంత్రి కెసిఆర్ ఎందుకు పాల్గొనలేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
కేంద్రం పై బురద చల్లే ముఖ్యమంత్రి, దేశ ప్రధాన మంత్రి ప్రజల ఆరోగ్యం, వారి ఆర్థిక పరిస్థతులపై ఎటువంటి భారం పడకుండా చూడాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచనలు ఇచ్చిన విషయం గురించి కనీసం తెలుసుకోవలన్న ఆలోచన కూడా కెసిఆర్ కు లేదని మండిపడ్డారు.
దేశ ప్రధాని ప్రజల కోసం తన సమయాన్ని కేటాయిస్తే, ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం చాలా బిజీగా ఉన్నారని డీకే అరుణ ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవహారశైలిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని డీకే అరుణ అన్నారు.