టాలీవుడ్ లో ఒకప్పుడు నిర్మాతల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. రామానాయుడు వంటి నిర్మాతల గురించి మీడియాలో ఎక్కువగా చర్చ జరిగేది. అగ్ర హీరోలతో ఆయన చేసిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. చిన్న సినిమాలకు కూడా పెట్టుబడులు పెట్టడానికి ఏ మాత్రం వెనకడుగు వేసేవారు కాదు. యువ హీరోలను పరిచయం చేసేందుకు సిద్దంగా ఉండేవారు రామానాయుడు.
ఇక ఆయన ఒక ఇంటర్వ్యూలో తాను సినిమాల్లోకి రావడానికి ఎంత కష్టపడింది వివరించారు. తాను సినిమాల్లోకి వచ్చేందుకు గాను 300 ఎకరాలు అమ్ముకున్నాను అని తెలిపారు. తాను మేనత్త కూతుర్ని వివాహం చేసుకున్నాను అని వ్యవసాయం చేస్తే అందులో ఎదురు దెబ్బలు తగిలాయని, రైస్ మిల్ విషయంలో కూడా ఇబ్బంది పడ్డాను అని చెప్పారు. నమ్మిన బంటు సినిమాలో అక్కినేనికి డూప్ గా నటించాను అన్నారు.
అదే విధంగా హీరోయిన్ల విషయంలో తాను చాలా జాగ్రత్తగా ఉండేవాడిని అని చెప్పారు. ఇక శోభన్ బాబుతో తనకు చాలా మంచి సంబంధాలు ఉండేవి అని తెలిపారు. శోభన్ బాబు సంపాదించిన సొమ్ముతో ఆస్తులు కొనుక్కున్నారు అని వివరించారు. తన భార్య షూటింగ్ లకు ఎప్పుడు రాలేదని ఆయన పేర్కొన్నారు. శివాజీ గణేషన్ తో కూడా తనకు మంచి స్నేహం ఉందని ఆయన మంచి జోక్స్ వేసేవారని పేర్కొన్నారు.