కరోనా మహమ్మరి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో దేశంలో ఇన్ ఫ్లూఎంజా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్యం, దగ్గు వంటి లక్షణాలు ఎదుర్కొంటున్న చాలా మందిలో H3N2 ఇన్ఫ్లుఎంజా వైరస్ ప్రబలతున్నట్లు నిర్ధారణ అయింది. ఇది సాధారణ ఫ్లూ గా భావిస్తున్న ప్రజలు సరైన రోగనిర్ధారణ చేసుకోకుండా, వైద్యులను సంప్రదించకుండానే ఫార్మసీ స్టోర్లకు పరుగులు పెడుతూ ఫ్లూ ఔషధాలు, యాంటీ బయోటిక్ ట్యాబ్లెట్లు, ఇంటి నివారణలు ప్రయత్నిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఈ క్రమంలో కొవిడ్ 19 యొక్క సహ ఇన్ ఫెక్షన్లతో సంబంధం ఉన్న హెచ్ 3 ఎన్ 2 ఇన్ ఫ్లూ ఎంజా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు. దీని గురించి ఓ వైద్యాధికారి ప్రస్తావిస్తూ కొవిడ్ 19 మరియు ఇన్ ఫ్లూ ఎంజా రెండు కూడా కొద్దిగా దగ్గరదగ్గర లక్షణాలను కలిగి ఉన్నాయి. అవి రెండు మూడు నెలలు వరకు ఉండవచ్చని తెలిపారు.
ప్రస్తుతం మనం ఇన్ఫ్లూయెంజా కేసులు పెరగడాన్ని చూస్తున్నాం. ఏటా ఈ టైంలో ఈ వైరస్ వ్యాప్తి పెరుగుతుంటుంది. దీని వల్ల జ్వరం, దగ్గు, గొంతులో గరగర, ఒళ్లు నొప్పులు, జలుబు వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అయితే..ఈ వైరస్ ఏటా మార్పులకు లోనవుతుంది. దీన్ని యాంటీజెనిక్ డ్రిఫ్ట్ అంటారు. కొన్నేళ్ల క్రితం హెచ్1ఎన్1 వైరస్తో సంక్షోభం వచ్చింది. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నది హెచ్3ఎన్2 రకం వైరస్.
ఇది సాధారణ ఫ్లూ వేరియంటే. అయితే..వైరస్ తరచూ మార్పులకు లోనై రోగనిరోధక శక్తి నుంచి తప్పించుకోగలుగుతోంది. దీంతో.. కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ వైరస్ గాల్లో తుంపర్ల ద్వారా వ్యాపిస్తోంది. అయితే..ఇదేమంతా ఆందోళనకరమైన అంశం కాదు. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్యలో భారీ పెరుగుదల లేదు’’ అని డా. గులేరియా వివరించారు. వాతావరణ మార్పుల కారణంగా హెచ్3ఎన్2 సహజంగానే మార్పులకు లోనవతుంటుందని చెప్పుకొచ్చారు.
ప్రజల్లో మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి అలవాట్లు తగ్గడంతో ఇన్ఫ్లుయెంజా కేసుల సంఖ్య పెరుగుతోందని ఆయన చెప్పారు. ఈ జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వైరస్ వేగంగా వ్యాపించగలుగుతోందని చెప్పారు. కాబట్టి.. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు దరించాలని, తరచూ చేతులను శుభ్రపరుచుకోవాలని సూచించారు.